News February 25, 2025
గిద్దలూరు: వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులు అరెస్ట్

గిద్దలూరులోని పీఆర్ కాలనీలో వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. రాబడిన సమాచారం మేరకు అర్బన్ సీఐ సురేశ్ వ్యభిచార గృహంపై దాడికి దిగారు. ఇద్దరు విటులను, మహిళలను, మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి విటులకు కౌన్సిలింగ్ ఇచ్చి యువకులపై కేసు నమోదు చేశామని సీఐ సురేశ్ తెలిపారు.
Similar News
News December 23, 2025
ప్రకాశం జిల్లాలో యూరియాకై ప్రణాళిక సిద్ధం

ప్రకాశం జిల్లాలో రబీ సీజన్కు సంబంధించి 34878 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లాకు మొత్తం 23115 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికీ 31872 పెళ్లి టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందని డిసెంబర్కు 350 మెట్రిక్ టన్నులు రానుందన్నారు.
News December 23, 2025
ప్రకాశం: బిడ్డ మోసానికి.. RDO న్యాయం

కన్న బిడ్డ మోసం చేస్తే.. ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న ఆ తల్లికి న్యాయం చేశారు. ముండ్లమూరు మండలం కొమ్మవరానికి చెందిన రమాదేవికి ఒక కుమారుడు ఉన్నారు. కాగా రమాదేవి పేరుమీద ఉన్న 1.96 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమె మృతి చెందినట్లు తప్పుడు సర్టిఫికెట్ సృష్టించి వేరొకరికి ఆ భూమి విక్రయించాడు. రమాదేవి దీనిపై RDOకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఆర్డీవో విక్రయాన్ని రద్దుచేసి సహకరించిన అధికారులపై చర్యలకు ఆదేశించారు.
News December 23, 2025
మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలి: కలెక్టర్

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్న భోజనం అమలుకు సంబంధించి జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ రాజాబాబు అధ్యక్షత నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం నూరు శాతం అమలుజరగడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందని, నాణ్యత లోపాలు లేకుండా చూడాలన్నారు.


