News June 11, 2024
గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి: ఖుష్బూ గుప్తా

గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా సూచించారు. మంగళవారం ఉట్నూర్ పట్టణంలోని పీఎంఆర్సీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. చిన్నారులకు ప్రాథమిక స్థాయిలోనే నూతన ఒరవడిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించడానికి దృష్టి సారించామని ఆమె వెల్లడించారు.
Similar News
News November 18, 2025
ADB: ఉపకార వేతనం మంజూరుకై దరఖాస్తుల ఆహ్వానం

2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు తెలిపారు. అర్హులైన విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా డిసెంబర్ 15 లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 18, 2025
ADB: ఉపకార వేతనం మంజూరుకై దరఖాస్తుల ఆహ్వానం

2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు తెలిపారు. అర్హులైన విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా డిసెంబర్ 15 లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 18, 2025
ADB: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు: డీఈఓ

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ఫెయిల్ విద్యార్థుల పరీక్ష రుసుమును చెల్లించేందుకు తేదీలను పొడిగిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో ఇంటర్ గేషన్ సైబర్ ట్రెజరీ ద్వారా ఫీజు చెల్లించాలని తెలిపారు. పరీక్ష రుసుముల వివరాల కోసం http://bse.telangana.gov.in వెబ్సైట్ను చూడాలని ఆయన సూచించారు.


