News April 16, 2025

గిరిజనులకు సదుపాయాలు కల్పించాలి: నంద్యాల కలెక్టర్

image

ప్రధానమంత్రి జన్మన్ క్రింద గిరిజన నివాసిత ప్రాంతాల్లో గుర్తించిన మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేసేలా.. చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి జన్మన్ పథకాల గుర్తించిన 11 అంశాల పురోగతిపై మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 14 మండలాల్లో 48 గిరిజన నివాసిత ప్రాంతాల్లో CM జన్మన్ కింద గుర్తించిన 11అంశాలలో పనులను పూర్తి చేయాలన్నారు.

Similar News

News November 5, 2025

కర్నూలు కలెక్టరే టీచర్!

image

కర్నూలు కలెక్టర్ ఏ.సిరి మంగళవారం కోడుమూరులోని మహిళా సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థినుల మధ్య ఉపాధ్యాయురాలిగా కూర్చుని, వారికి విద్యపై మార్గదర్శకత్వం అందించారు. చదువులో మెళకువలు, సమయపాలన ప్రాముఖ్యత గురించి వివరించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. హాస్టల్‌లో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

News November 5, 2025

శ్రీకాకుళం: మీలో ప్రతిభకు ఈ పోటీలు

image

యువజన సర్వీసుల శాఖ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో (జానపద బృంద నృత్యం, గీతాలు), స్టోరీ రైటింగ్, కవిత్వం, చిత్రలేఖనం, డిక్లమేషన్ పోటీలను NOV 11న నిర్వహించనున్నారు. ఆ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పలనాయుడు ప్రకటనలో తెలిపారు. 15-29 ఏళ్లు ఉన్న యువతీ, యువకులు అర్హులని, శ్రీకాకుళం(M)మునసబపేటలోని గురజాడ ఆడిటోరియంలో పోటీలు జరుగుతాయన్నారు. వివరాలకు పని వేళల్లో ఈనం:97041 14705ను సంప్రదించాలన్నారు.

News November 5, 2025

అచ్చంపేట: రేషన్ కార్డు లబ్ధిదారులకు సంచులు పంపిణీ

image

రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రతి నెల బియ్యం కోసం ఇంటి వద్ద నుంచి సంచులు తెచ్చుకునేవారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నేల నవంబర్ ఫస్ట్ నుంచి లబ్ధిదారులకు ఉచితంగా సీఎం, ఉప ముఖ్యమంత్రి, శాఖ మంత్రి ఫొటోలతో ఉన్న సంచులను పంపిణీ చేస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లాలో 550 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 2 లక్షల 43వేల 720 సంచులను మంజూరు చేశారు. రేషన్ డీలర్లు రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు.