News June 27, 2024

గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్సులు: మంత్రి

image

గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. గిరిజనుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలలో మందులు అందుబాటులో ఉండేలా పూర్తి చర్యలు చేపట్టాలని సూచించారు. పీహెచ్సీ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

Similar News

News October 20, 2025

ప్రతి కుటుంబానికి రూ.15వేల లబ్ది: కలెక్టర్

image

జిల్లాలో సుమారు నెల రోజులుగా కొనసాగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ప్రజలలో విశేష స్పందన వచ్చిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆవిష్కరణగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా నాలుగు స్లాబుల నుంచి రెండు స్లాబులకు తగ్గించడంతో 98 శాతం ఉత్పత్తులు ధరలు తగ్గాయని తెలిపారు. పారదర్శక పన్ను విధానం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి కనీసం రూ. 15 వేలు లబ్ది చేకూరుతుందన్నారు.

News October 19, 2025

బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా పేల్చాలి: ఎస్పీ

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రజలు బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా పేల్చాలని ఎస్పీ ఎఆర్ దామోదర్ కోరారు. దీపావళి సందర్బంగా ఆదివారం జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు నివారించాలని కోరారు. బాణాసంచాకు చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి లేదా పెద్దల పర్యవేక్షణలో కాల్చాలని కోరారు. కాటన్ దుస్తులను ధరించి మతాబులు కాల్చాలన్నారు. మతాబులు కాల్చిన తర్వాత వ్యర్దాలు సురక్షితమైన ప్రదేశాలలో వేయాలన్నారు.

News October 19, 2025

VZM: నిబంధనలు పాటించని బాణాసంచా వ్యాపారులు

image

నగరంలోని బాణాసంచా షాపు యజమానులు అగ్నిమాపక నిబంధనలు పాటించడం లేదు. KL పురంలో అధికారికంగా 8 షాపులు ఉండగా, తాత్కాలిక అనుమతులతో మరో 15 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మంటలు చెలరేగితే ఆర్పేలా సంబంధిత పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ 25వేల లీటర్ల నీటి సామర్ధ్యంతో ఒక సంపు, నిర్మించుకోవాలి. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాల్సిన అగ్నిమాపక అధికారులు అటు వైపు చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.