News March 26, 2025

‘గిరిజన నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’

image

కర్నూలు జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ తరగతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌ను కలిసి వినతపత్రం అందచేశారు. టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ.. జిల్లాలో ఎంతోమంది గిరిజన నిరుద్యోగ యువత ఉపాధి లేక జీవనాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. అలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక శిక్షణను సెట్కూరు ద్వారా అందించాలని కోరారు.

Similar News

News April 2, 2025

రేపు కర్నూలుకు YS జగన్ రాక.!

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు కర్నూలుకు రానున్నారు. ఉదయం 9:30కు తాడేపల్లి నివాసం నుంచి బయలు దేరి 11:45కు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం కర్నూలు GRC కన్వెన్షన్ హాల్లో జరిగే కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి కూతురి వివాహా కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యాలయం తెలిపింది. దీంతో జగన్ రాకకు జిల్లా వైసీపీ నాయకులు ఏర్పాట్లను పూర్తి చేశారు.

News April 2, 2025

కర్నూలు: నేటి నుంచి JEE మెయిన్స్.. ఇవి పాటించాలి.!

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు JEE మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. కాగా.. పరీక్షను హజరయ్యేవారు కింది విషయాలు తప్పక పాటించాలని అధికారులు తెలిపారు.
➤పరీక్షా కేంద్రానికి 30 నిమూషాల ముందే రావాలి.
➤పేపర్-1 పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యహ్నం 12 వరకు.
➤2వ పేపర్ మధ్యహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు.
➤ఉదయం పరీక్షకు 7గంటలకు, మధ్యహ్నం పరీక్షకు 1గంటకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.

News April 2, 2025

కర్నూలు జిల్లాకు వర్ష సూచన

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ (APSDMA) పేర్కొంది. కాబట్టి రైతులు, కూలీలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అంతే కాకుండా వర్షాలు పడే సమయంలో, రైతులు పొలాల్లోని చెట్ల కింద ఉండరాదని, వాతావరణంలో మార్పులు రాగానే ఇళ్లకు చేరుకోవాలని తెలిపింది.

error: Content is protected !!