News March 15, 2025
గిర్నిబావి వద్ద కాల్పులు జరగలేదు: వరంగల్ సీపీ

కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావిలో ప్రభ బండ్లు వరుస క్రమంలో తరలి వెళ్లే క్రమంలో కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా సదరు వ్యక్తులు ముందుకు వెళ్లారన్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రభ బండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగిందని, ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదని వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ తెలిపారు.
Similar News
News October 31, 2025
₹10,000 cr సాయానికి AI అభ్యర్థన

అహ్మదాబాద్లో బోయింగ్-787 కుప్పకూలిన తర్వాత ఎయిర్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ ప్రమాదంలో 260మందికి పైగా మరణించారు. దీంతో నియంత్రణ నిబంధనలు కఠినమై సర్వీసుల నిర్వహణ కష్టంగా మారింది. ప్రాంతీయ ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ఎయిర్ రూట్లలో దూరం పెరిగి ఖర్చుల భారం పెరిగింది. వీటి నుంచి బయటపడేందుకు ₹10,000CR సాయం అందించాలని యాజమాన్య సంస్థలు టాటాసన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ను AI అర్థించింది.
News October 31, 2025
పెద్దపల్లి: ఎన్సీడీ కార్యక్రమంపై సమీక్షా సమావేశం

పెద్దపల్లి కలెక్టరేట్లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కార్యక్రమంపై నర్సింగ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లతో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.వాణిశ్రీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్సీడీ వెబ్సైట్లో వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, అప్డేట్ చేయని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 13 ఉప కార్యక్రమాల అమలు, ప్రజారోగ్య పరిరక్షణ ప్రాముఖ్యతపై సమగ్ర మార్గదర్శకాలు జారీ చేశారు.
News October 31, 2025
MGB, NDAలకు కీలకంగా మారిన ‘బిహార్ వార్’

బిహార్లో ప్రధాన కూటములు పోటాపోటీ హామీలు గుప్పించాయి. ‘తేజస్వీ ప్రాణ్’ పేరిట MGB ‘సంపూర్ణ బిహార్ కా సంపూర్ణ పరివర్తన్’ నినాదంతో స్టేట్ రూపురేఖలు మారుస్తామంది. గత ప్రభుత్వ అవినీతిని నిర్మూలిస్తామని చెప్పింది. NDA ‘సంకల్ప్ పాత్ర్’ పేరుతో రాష్ట్రాన్ని పారిశ్రామిక, విద్యా కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చింది. ఈ ఎన్నికలు అక్కడి పాలనా పగ్గాల కోసమే కాక హిందీ బెల్టులో పాగా వేసేందుకు కీలకం కావడమే కారణం.


