News March 2, 2025

గీసుగొండ: భార్యతో గొడవ.. భర్త సూసైడ్

image

మనస్తాపంతో యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గీసుగొండ మండలంలో జరిగింది. గీసుగొండ సీఐ మహేందర్ కథనం ప్రకారం.. మరియాపురానికి చెందిన గొలమారి థామస్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన మంజులతో కులాంతర వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. కాగా భార్యాభర్తల మధ్య విభేదాలు రాగా మనస్తాపం చెందిన థామస్ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడి అక్క నీలిమ ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేశారు.

Similar News

News October 12, 2025

వరంగల్: 97%తో రికార్డు స్థాయిలో పల్స్ పోలియో

image

నేటి ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా జరిగింది. మొత్తం 20,101 మంది పిల్లలకు లక్ష్యంగా, 19,546 మందికి పోలియో వ్యాక్సిన్ వేసి 97 శాతం రికార్డు సాధించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.సాంబశివరావు తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు పోలియో చుక్కలు తప్పక వేయించాలన్నారు.

News October 12, 2025

పదో వసంతంలోకి వరంగల్ జిల్లా..!

image

వరంగల్ జిల్లా 2016 అక్టోబర్ 11న ఏర్పాటైంది. నిన్నటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న జిల్లా నేటి నుంచి పదో వసంతంలోకి అడుగు పెట్టింది. కాగా కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత అభివృద్ధి పనులు జరిగాయని కొందరు.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని మరికొందరు అంటున్నారు. గ్రామీణ రోడ్లు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వ భవనాలు, స్కూళ్లు, హాస్టళ్లు సరిగా లేవని చెబుతున్నారు. మీ జిల్లా అభివృద్ధి అయ్యిందా కామెంట్ చేయండి.

News October 12, 2025

WGL: బిల్లులు రాక.. మధ్యాహ్న భోజన నిర్వాహకుల ఇబ్బందులు

image

జిల్లాలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు 8 నెలలుగా కోడిగుడ్ల బిల్లులు అందడం లేదు. మొత్తం 344 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 13,725 మంది విద్యార్థులు చదువుతుండగా వారికి ప్రతి రోజూ మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు భోజనం అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం ప్రతి నెల రూ.3 వేల వేతనం చెల్లిస్తోంది. భోజనానికి బిల్లులను తరగతుల వారీగా, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విడుదల చేస్తోంది.