News February 12, 2025

గుంటుపల్లిలో కుళ్లిపోయిన మృతదేహం కలకలం

image

గుంటుపల్లి శివారులో మంగళవారం కుళ్లిపోయిన మృతదేహం కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. గుంటుపల్లి శివారు కృష్ణానది ఒడ్డున ఓ షెడ్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సుమారుగా 30 రోజుల క్రితం వ్యక్తి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో దుర్గంధం వెదజల్లుతుంది. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 3, 2025

₹274 కోట్లు దోచి పరారైన డోన్ రియల్టర్!

image

డోన్‌కు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని ప్రముఖుల నుంచి ₹274 కోట్లు అప్పులు, పెట్టుబడుల రూపంలో వసూలు చేసి అమెరికా పరారయ్యాడు. చిరుద్యోగి అయిన అతడు స్థిరాస్తి వ్యాపారంలోకి దిగి బెంగళూరులో ఆఫీస్ ప్రారంభించాడు. సొంత డబ్బుతో విదేశీ యాత్రలు, పార్టీలు ఇస్తూ ప్రముఖులకు దగ్గరై భారీగా డబ్బులు వసూలు చేశాడు. కొన్ని రోజులుగా అందుబాటులో లేకపోవడంతో బాధితులు బయటకు చెప్పలేక కుమిలిపోతున్నారు.

News December 3, 2025

మెదక్: అత్తమామల వేధింపులు.. తల్లీకొడుకు బలి

image

చిన్నశంకరంపేట మం. ఖాజాపూర్‌లో అత్తమామల వేధింపులకు <<18446685 >>తల్లి, కొడుకు<<>> బలయ్యారు. గ్రామానికి చెందిన తాళ్ల ప్రవీణ్ గౌడ్‌కు నార్సింగి మం. సంకాపూర్‌కు చెందిన అఖల(23)తో నాలుగేళ్ల క్రితం పెళ్లి కాగా రియాన్స్(2) సంతానం. భర్త ప్రవీణ్ ఆరు నెలల క్రితం అనుమానాస్పదంగా మృతిచెందాడు. అప్పటి నుంచి మనుమడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోవాలని అత్తమామలు వేధిస్తున్నారు. దీంతో నిన్న కొడుకుకు ఊపిరాడకుండా చేసి అఖిల ఉరేసుకుంది.

News December 3, 2025

ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఆరు నుంచి 12 వారాల్లో బిడ్డ అవయవాలన్నీ ఏర్పడుతాయి. ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్‌రేలకు దూరంగా ఉండాలి. ఏ సమస్య అనిపించినా వైద్యులను సంప్రదించాలి. జ్వరం వచ్చినా, స్పాంటింగ్ కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జన్యుపరమైన సమస్యలుంటే తప్ప అబార్షన్‌ కాదు. కాబట్టి అన్ని పనులు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, పరిగెత్తడం మానేయాలని సూచిస్తున్నారు.