News February 6, 2025

గుంటూరులో మహేశ్ బాబు ఓటు తొలగింపు 

image

ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుంటూరు పట్టణ పరిధిలో ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు పేరుతో ఓటర్ జాబితాలో ఓటు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఆయన పేరుతో ఓటు తప్పుగా నమోదు అయిందని GMC అడిషనల్ కమిషనర్ ఓబులేసు తెలిపారు. ఫారం-7 విచారణ అనంతరం ఓటు హక్కును తొలగించినట్లు ఆయన చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 

Similar News

News February 24, 2026

నల్గొండ: అన్నదాతకు ‘స్మార్ట్’ ఫోన్ కష్టాలు

image

యూరియా పంపిణీకి ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్ యాప్ ఉమ్మడి NLG రైతుల పాలిట శాపంగా మారింది. స్మార్ట్‌ఫోన్లు లేక, ఓటీపీలు రాక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుక్ చేసేలోపే స్టాక్ నిండుకోవడం, యాప్‌లో చూపించినా డీలర్ల వద్ద బస్తాలు ఉండకపోవడంతో నిరాశ చెందుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. విసిగిపోయిన రైతులు.. యాప్‌ను రద్దు చేసి పాత పద్ధతిలో ఎరువులు అందజేయాలని రోడ్డెక్కుతున్నారు.

News February 24, 2026

గుంటూరు: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. మంగళవారం గుంటూరు ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పరీక్షా కేంద్రంలో కనీస అవసరాలైన తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకొనుటకు బస్ సౌకర్యం అంశాలను అడిగారు.

News February 24, 2026

కర్నూలు జిల్లా అభివృద్ధిపై మంత్రుల సమీక్ష

image

మంత్రులు రామానాయుడు, టీజీ భరత్ సమక్షంలో కర్నూలు జిల్లా అభివృద్ధిపై కీలక సమీక్ష జరిగింది. కలెక్టర్ డా.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎంపీ నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ పాల్గొన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల అవసరాలపై నివేదికలు సమర్పించారు. ఈ నెల 26న సీఎం చంద్రబాబు నాయుడితో జరిగే భేటీ కోసం పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు వెల్లడించారు.