News March 22, 2025
గుంటూరులో రిమాండ్ ఖైదీ పరార్..!

మూత్రవిసర్జన ముసుగులో రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. కొత్తపేట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చోరీకేసులో నిందితుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అనే ఖైదీని గుంటూరు జిల్లా జైలు నుంచి తీసుకెళ్ళి తెనాలి కోర్టులో హాజరుపర్చారు. తిరుగు ప్రయాణంలో గుంటూరు బస్టాండ్లో మూత్రవిసర్జన కోసం వెళ్లి ఖైదీ తిరిగి రాలేదు. దీంతో ఎస్కార్ట్ పోలీసులు కొత్తపేట స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Similar News
News November 24, 2025
జమ్మూ టూరిజంపై ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జమ్మూ టూరిజాన్ని ఢిల్లీ బ్లాస్ట్ మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టింది. వింటర్ సీజన్ కావడంతో టూరిజం కార్యకలాపాలపై CM ఒమర్ అబ్దుల్లా సహా ట్రావెల్ ఏజెంట్లూ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల జరిగిన ఢిల్లీ బాంబుదాడితో టూరిస్టుల్లోనూ భయం నెలకొంది. పైగా దాడిలో కశ్మీర్ మూలాలున్న ఇద్దరిని NIA అరెస్టు చేసింది. ఇది మరోసారి జమ్మూ టూరిజంపై ఎఫెక్ట్ పడేలా చేసింది.
News November 24, 2025
పార్వతీపురం: డ్యాంలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

కొమరాడ మండలం జంఝావతి రబ్బర్ డ్యాం వద్ద ఆదివారం ముగ్గురి వ్యక్తులు గల్లంతైన విషయం తెలిందే. వీరిలో ప్రతాప్, గోవింద నాయుడు మృతదేహాలు గుంప సోమేశ్వర స్వామి ఆలయ సమీపంలో సోమవారం ఉదయం నీటిలో కనిపించడంతో స్థానికులు చూసి కొమరాడ పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసే పనిలో పోలీసులు ఉన్నారు. శరత్ కుమార్ మృతదేహం కూడా సమీపంలోనే ఉండే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
News November 24, 2025
AAIలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లో 20గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ డిగ్రీ, డిగ్రీ (B.Com, BA, BSc, BBA), డిప్లొమా ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు నెలకు రూ.15వేలు, డిప్లొమా అప్రెంటిస్లకు రూ.12వేలు చెల్లిస్తారు. అభ్యర్థులు NATS పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్సైట్: aai.aero.


