News February 25, 2025

గుంటూరులో లారీ ఢీకొని ఇద్దరు మృతి

image

గోరంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో లారీ ఢీ కొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అమరావతి నుంచి గుంటూరు నగరంలోకి వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందియ. స్థానికుల సమాచారంతో నల్లపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుల్లో ఒక మహిళ, పురుషుడు ఉన్నారు.

Similar News

News November 22, 2025

HYD: పెళ్లి కావట్లేదని అమ్మాయి చనిపోయింది..!

image

ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట(D) మద్దూర్(M) రేబర్తి వాసి కుంటి నిరోష(32) సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది. చింతల్ పద్మానగర్‌లో తన సోదరుడు నరేశ్‌తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమెకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పెళ్లి కావట్లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.

News November 22, 2025

‘నక్క’ బుద్ధి చూపించింది!.. భారతీయుల ఆగ్రహం

image

ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ క్రికెట్‌ ఛానల్‌పై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో మ్యాచ్‌ అయితే ఒకలా, ఆస్ట్రేలియాలో అయితే మరోలా మాట్లాడుతోందని అంటున్నారు. యాషెస్‌ టెస్టులో తొలి రోజు 19 వికెట్లు పడ్డాయంటూ గొప్పగా రాసుకొచ్చింది. అయితే ఇటీవల INDvsSA టెస్టు మ్యాచ్‌లో ఒకేరోజు 15 వికెట్లు పడటంపై “RIP TEST CRICKET” అంటూ పేర్కొంది. దీంతో ‘నక్క’ బుద్ధి చూపిస్తోందని ట్రోల్ చేస్తున్నారు.

News November 22, 2025

కరీంనగర్: సర్వర్ డౌన్.. ‘సర్టిఫికేట్ల సేవలు బంద్’..!

image

కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(CDMA) సర్వర్ డౌన్‌తో రాష్ట్రంలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. దీంతో ఉమ్మడి KNR జిల్లాలో దరఖాస్తుదారులు ధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా మున్సిపల్ కార్యాలయాలల్లో సర్టిఫికేట్ల నమోదు, జారీ ప్రక్రియ ఆగిపోయింది. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు 4 రోజులుగా నెట్వర్క్ కంపెనీతో సంప్రదిస్తున్నా సమస్య అలానే ఉంది.