News July 5, 2024

గుంటూరు: అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

image

వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడుకి చెందిన కౌలు రైతు రాణాప్రతాప్ (34) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI వినోద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. 3 సంవత్సరాలుగా మృతుడు మిర్చి సాగు చేస్తున్నాడని, పంటలపై రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడన్నారు. అప్పు తీర్చే మార్గం లేక ప్రతాప్ జూన్ 29న గడ్డి మందు తాగడన్నారు. బంధువులు గుంటూరు GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు పోలీసులు నమోదు చేశారు.

Similar News

News October 29, 2025

ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్: కలెక్టర్

image

తుఫాను కారణంగా ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. తుఫాను సహాయక చర్యలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాత్రి సమయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాగులు, వంకలు ఎవరు దాటకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

News October 28, 2025

ANU: దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జులై, ఆగస్టులో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు మంగళవారం విడుదల చేశారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, సైకాలజీ, మ్యాథమెటిక్స్, ఎంసీఏ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్, ఫలితాలు తదితర వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుండి పొందువచ్చని చెప్పారు.

News October 28, 2025

GNT: జిల్లా ప్రజలకు ముఖ్య సూచన.. అత్యవసరమైతేనే

image

మొంథా తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు ప్రయాణాలపై పరిమితులు విధిస్తూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు జారీ చేసింది. రాత్రి 7 గంటల తర్వాత జాతీయ రహదారులపై భారీ వాహనాలు నడపకూడదని, ముందుగానే సురక్షిత లే బే ప్రాంతాల్లో నిలిపి వేయాలని తెలిపింది. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప ప్రయాణాలు చేయవద్దని, ప్రతి ఒక్కరూ సూచనలు తప్పక పాటించాలని విజ్ఞప్తి చేసింది.