News April 10, 2025

గుంటూరు: అలర్ట్.. ఏప్రిల్ 30 వరకే గడువు 

image

గుంటూరు జిల్లాలో రేషన్ కార్డు ఉన్నవారు ఈనెల 30లోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. రేషన్ డీలర్ లేదా ఎండీయూ వాహనం వద్ద పోస్ మెషిన్‌లో మీ వివరాలు తెలుసుకోవచ్చు. ఎర్ర రంగులో పేరు ఉంటే ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉన్నట్లు. వెంటనే వేలిముద్ర వేసి పూర్తిచేయండి. ఐదేళ్లలోపు, 80ఏళ్లు పైబడిన వారికి ఇది వర్తించదు. గడువులోగా పూర్తిచేయాలని అధికారులు సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం epds1 వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు. 

Similar News

News November 24, 2025

GNT: నేడు వంగర వెంకట సుబ్బయ్య జయంతి

image

తెలుగు సినిమా, నాటక రంగాలలో ప్రసిద్ధి చెందిన హాస్యనటుడు వంగర వెంకట సుబ్బయ్య జయంతి నేడు. ఆయన 1897, నవంబర్ 24న సంగం జాగర్లమూడిలో జన్మించారు. రంగస్థల ప్రస్థానంలో తెనాలిలో స్థిరపడి, ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకంలో వసంతకుడి వేషంతో కళాహృదయుల మన్ననలు అందుకున్నారు. ఆయన దాదాపు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. ‘పెద్దమనుషులు’, ‘కన్యాశుల్కం’, ‘మాయాబజార్’ వంటి చిత్రాలలో తన హాస్యంతో ప్రేక్షకులను అలరించారు.

News November 24, 2025

పీజీఆర్ఎస్ సద్వినియోగం చేస్కోండి: కలెక్టర్

image

Meekosam.ap.gov.inలో PGRS అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. నేరుగా పీజీఆర్ఎస్‌లో కూడా అందించవచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని చెప్పారు. అర్జీ స్థితి గతులను 1100 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

News November 24, 2025

పీజీఆర్ఎస్ సద్వినియోగం చేస్కోండి: కలెక్టర్

image

Meekosam.ap.gov.inలో PGRS అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. నేరుగా పీజీఆర్ఎస్‌లో కూడా అందించవచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని చెప్పారు. అర్జీ స్థితి గతులను 1100 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.