News June 6, 2024
గుంటూరు ఇండిపెండెంట్ MP అభ్యర్థికి 172 ఓట్లు

గుంటూరు ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థి ఎం. నాగరాజుకు కేవలం 172 ఓట్లు వచ్చాయి. ఈయనతో పోలిస్తే నోటాకు వచ్చిన ఓట్లు చాలా ఎక్కువ(7387)గా ఉన్నాయి. మరోవైపు, మూడో స్థానంలో ఉన్న సీపీఐ అభ్యర్థికి 8,637 వచ్చాయి. గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల మెజారిటీతో గెలవగా.. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు 5,20,253 ఓట్లు పోల్ అయ్యాయి.
Similar News
News December 26, 2025
GNT: మృతిచెందిన వృద్ధురాలు మీకు తెలుసా.?

గుంటూరు కలెక్టరేట్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని వృద్ధురాలిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు నగరంపాలెం పోలీసులు తెలిపారు. గురువారం వృద్ధురాలు పడిపోయి ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది ఆసుపత్రిలో చేర్చారన్నారు. చికిత్స పొందుతూ మరణించిన ఆమె ఆచూకీ తెలిసిన వారు స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
News December 26, 2025
GNT: సినీ జగత్తులో శాశ్వత వెలుగు.. మహానటి సావిత్రి

తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన మహానటి సావిత్రి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. 1935లో గుంటూరు జిల్లా చిర్రావూరులో జన్మించిన ఆమె, అతి తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగి, సావిత్రి అంటేనే అభినయం అనే స్థాయికి చేరారు. మాయాబజార్లో శశిరేఖ పాత్రతో అమరత్వం పొందిన ఆమె, భావోద్వేగాలకు ప్రాణం పోసిన నటిగా సినీ చరిత్రలో నిలిచారు. @నేడు ఆమె వర్ధంతి.
News December 25, 2025
అమరావతి రైల్వే లైన్.. మరో 300 ఎకరాల సేకరణ

ఎరుపాలెం-అమరావతి-నంబూరు బ్రాడ్ గేజ్ లైన్ పనుల్లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 300 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీరుల్లపాడు, కంచికచర్ల మండలాల్లోని 8 గ్రామాల్లో ఈ భూమిని సేకరించనున్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములు ఉన్నాయి. 56.53 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు అమరావతికి రైలు మార్గం కల్పించడంలో కీలకమని అధికారులు అంటున్నారు.


