News September 11, 2024

గుంటూరు: ఏఏస్ఐలకు ప్రమోషన్

image

గుంటూరు రేంజ్ పరిధిలో ఏడుగురు ఏఏస్ఐలకు ఎస్ఐలుగా ప్రమోషన్ కల్పిస్తూ సౌత్ కోస్టల్ జోన్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశంలో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు ఏఏస్ఐలు ఈ జాబితాలో ఉన్నారు. వీరికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఫోస్టింగ్స్ ఇస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News December 27, 2025

GNT: నేడు జీఎంసీ కౌన్సిల్ సమావేశం .

image

గుంటూరు నగరపాలకసంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం కౌన్సిల్ సాధారణ సమావేశం జరగనుంది. ఈ మేరకు మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన ఉదయం 10:30 గంటల నుంచి సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు ఈ సమావేశానికి హాజరవ్వాలని కమిషనర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

News December 27, 2025

గుంటూరు: ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.5 లక్షలు టోకరా

image

తాడికొండ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం చీటింగ్ కేసు నమోదైంది. రావెల గ్రామానికి చెందిన ఫిర్యాదుదారు వీలేటి నాగచైతన్య వివరాల మేరకు.. మైలబత్తుల బాబు మహేష్, బాలరామ్, నందా కలిచ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నకిలీ ఆఫర్ లేఖ చూపించి, రూ.5 లక్షలు తీసుకున్నారన్నారు. అనంతరం కంపెనీకి వెళ్లగా, ఆ ఆఫర్ లేఖ నకిలీదని తేలింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు.

News December 27, 2025

GNT: నేడు విభిన్న ప్రతిభావంతులకు స్పెషల్ గ్రీవెన్స్

image

విభిన్న ప్రతిభావంతులకు శనివారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి, ఇన్‌ఛార్జ్ జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడు దుర్గా భాయ్ తెలిపారు. ప్రతి నెల 4వ శనివారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. జిల్లాలో విభిన్నప్రతిభావంతులు, వయోవృద్దులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ గ్రీవెన్స్‌కు హాజరై వారి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.