News May 11, 2024
గుంటూరు: ఓటర్లకు ప్రలోభాలు.?

మరికొన్ని గంటల్లో గుంటూరు జిల్లాలో ఓట్ల పండగ జరగనుంది. నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుండగా, ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. గుంటూరులో, నరసరావుపేటలో ఓటుకు రూ.2 వేలు, మాచర్లలో రూ.3 వేలు ఒకరు.. రూ.2 వేలు మరొకరు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓ చోట ఏకంగా రూ.5వేల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులు తమకంటే ఎక్కువిస్తే.. 2వసారి పంపిణీకీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Similar News
News December 9, 2025
విద్యార్థుల గళంపై కూటమి ఉక్కుపాదం మోపుతుంది: YCP

విద్యార్థుల గళంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని YCP ‘X’లో పోస్ట్ చేసింది. YCP స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపినందుకు చైతన్యపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారని రాసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే కేసులా చంద్రబాబు, లోకేశ్ అంటూ ప్రశ్నించారు.
News December 9, 2025
దివ్యాంగులకు ఇళ్లు.. జాబితాను సిద్దం చేయాలి: కలెక్టర్

దివ్యాంగులకు గృహాల మంజూరుకు అర్హుల జాబితా సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల గృహాల అంశం పై కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ సమీక్షించారు. ఆధార్ చిరునామా, జాబ్ కార్డు తదితర వివరాలను పరిశీలించాలన్నారు. అవసరమైతే ఆధార్ చిరునామా మార్పు చేయాల్సి ఉంటుందని, అందుకు వారి సంసిద్ధతను తెలుసుకోవాలన్నారు. జిల్లాకు చెందిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
News December 9, 2025
మంగళగిరి: సీకే హైస్కూల్ ఈసారైనా రాణిస్తుందా?

మంగళగిరిలో ఏళ్ల చరిత్ర కలిగిన CKహైస్కూల్ విద్యార్థులు ఈసారైనా టెన్త్ ఫలితాల్లో రాణిస్తారా అనేది వేచి చూడాలి. గతంలో ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి మార్కులతో సత్తా చాటేవారు. కొన్నేళ్లుగా ర్యాంకుల సంగతి అటుంచితే ఉత్తీర్ణత శాతమే భారీగా పడిపోతూ వస్తోంది. ప్రస్తుతం విద్యాశాఖ అమలు చేస్తున్న 100రోజుల ప్రణాళికను టీచర్లు పటిష్ఠంగా అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టాలని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.


