News February 19, 2025

గుంటూరు: ‘కారు ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలి మృతి’ 

image

కారు ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందిన ఘటన సంగడిగుంట లాంఛెస్టర్ రోడ్డులో చోటుచేసుకుంది. గాంధీనగర్‌కి చెందిన కొండమ్మ (58) విధుల్లో ఉండగా ఓ యువకుడు తన కారు కింద ఉన్న కుక్కల్ని బయపెట్టడానికి ఎక్సలేటర్ ఇచ్చాడు. అప్పటికే గేరులో ఉన్న కారు పారిశుద్ధ్య కార్మికురాలిపైకి దూసుకువెళ్లడంతో ఆమె మృతిచెందినట్లు ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కమిషనర్ శ్రీనివాసులు, కార్మిక సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. 

Similar News

News March 19, 2025

గుంటూరు: వడదెబ్బ తగిలి గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళవారం నందివెలుగు రోడ్డు మణిహోటల్ సెంటర్ వద్ద డివైడర్ పై వడదెబ్బ తగిలి ఓ వ్యక్తి మరణించాడు. వార్డు సచివాలయ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకి చేరుకున్నారు. అనంతరం ఆ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. మృతిచెందిన వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లైతే స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

News March 19, 2025

బాలల సంరక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో బాలల సంరక్షణ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలు చేసి సత్ఫలితాలు సాధించాలని కలెక్టర్ నాగలక్ష్మీ చెప్పారు. ఇందుకు సంబంధిత శాఖలు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు స్థాయిలో బాలల సంక్షేమం, సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి బాల, బాలికల రక్షణ, పునరావాసం, విద్యా , వైద్యం అంశాలపై పరిశీలన చేయాలన్నారు.

News March 18, 2025

ఒక్క హామీ నెరవేర్చితే బాధ్యత తీరిపోయినట్టు కాదు: మంత్రి లోకేశ్

image

ఒక హామీ నెరవేర్చితేనే నా బాధ్యత తీరిపోయినట్టు కాదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం చేనేతలకు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని నిలబెట్టుకున్న సందర్భంగా మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీ లక్షలాదిమంది ప్రజలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఎంతో దోహదపడుతుందని అందులోనే తనకు సంతోషం ఉందని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలకు విస్తృత మార్కెటింగ్ కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానన్నారు.

error: Content is protected !!