News March 10, 2025

గుంటూరు: క్వశ్చన్ పేపర్ లీక్.. తీగలాగితే డొంక కదిలింది

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఈడీ ప్రశ్నా పత్రాల లీకేజీ విషయంలో 9 మంది ఏజెంట్లతో పాటూ వినుకొండలో ఓ కళాశాలకు చెందిన ఛైర్మన్, కంప్యూటర్ ఆపరేటర్ కీలకపాత్ర పోషించారు. ANU ఈ మేరకు తెనాలిలో ఓ వ్యక్తిని విచారించగా సామాజిక మాధ్యమం ద్వారా ప్రశ్నాపత్రం తనకు వచ్చిందని అన్నారు. ఆ తర్వాత లోతుగా దర్యాప్తు చేపట్టగా ప్రశ్నాపత్రం వినుకొండ నుంచి అందరికీ ఫార్వర్డ్ అయినట్లు నిర్ధారించుకున్నారు.

Similar News

News March 10, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 140 మంది గైర్హాజరు.!

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెట్-2 ప్రశ్నాపత్రంతో పరీక్షలు నిర్వహించినట్లు డీఐఈఓ రఘునాథ రెడ్డి సోమవారం తెలిపారు. పరీక్షలకు జనరల్ విద్యార్థులు 6339 మందికి గానూ.. 6236మంది, ఒకేషనల్ విద్యార్థులు 1144 మందికి గానూ 1107 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 140 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.

News March 10, 2025

కేంద్రమంత్రి నాలిక అదుపులో పెట్టుకోవాలి: సీఎం స్టాలిన్

image

కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘ధర్మేంద్ర తనను తాను రాజు అనుకుంటున్నారు. ఆయన నాలిక అదుపులో పెట్టుకోవాలి. ‘పీఎం శ్రీ’ పథకాన్ని మేమెప్పుడూ ఒప్పుకోలేదు. కానీ మేం ఒప్పుకుని మాట మార్చామంటూ ఆయన అవాస్తవాలు చెబుతున్నారు. మీరు తమిళనాడు విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధుల్ని ఇస్తారా లేదా ముందు అది చెప్పండి’ అని ప్రశ్నించారు.

News March 10, 2025

రవిచంద్ర నామినేషన్‌లో ఎమ్మెల్యేలు

image

ఎమ్మెల్యే కోటా శాసనమండలి సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆయన వెంట ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, కావ్యా కృష్ణారెడ్డి ఉన్నారు.

error: Content is protected !!