News May 4, 2024

గుంటూరు: గిరిజన గురుకులాల్లో దరఖాస్తుల ఆహ్వానం

image

తెనాలి, గుంటూరులో నడుస్తున్న మూడు ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలుర, బాలికల గురుకులాల్లో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ బండి విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుంచి 9 వ తరగతి వరకు గురుకులాల వారీగా ఉన్న ఖాళీల వివరాలను ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు గురుకులాల్లో సంప్రదించాలన్నారు.

Similar News

News December 30, 2025

గుంటూరు జిల్లాలో 25% మేర తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు

image

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై నియంత్రణకు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. 2025 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది 322 మంది మృతి చెందగా, 2024లో 429 మంది మరణించారు. దీంతో 25 శాతం మేర తగ్గుదల నమోదైంది. అలాగే ఈ సంవత్సరం 76 అత్యాచారం కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది తో పోలిస్తే 6% తగ్గాయి. ఈ కేసులలో ఎక్కువ శాతం ప్రేమ వ్యవహారంతో కూడినవిగా ఉన్నవి.

News December 30, 2025

జిల్లాలో 1,090 కేసులలో ₹11.88 కోట్ల ఆస్తి రికవరీ

image

2025లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,090 చోరీ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠాలపై దృష్టి సారించిన పోలీసులు పలు ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా రూ.11,88,55,702 విలువైన ఆస్థిని రికవరీ చేసినట్లు తెలిపారు. గత ఏడాదికి సంబంధించిన 176 కేసుల్లోనూ రికవరీ పూర్తి చేసి బాధితులకు ఆస్తులు అప్పగించారు. నేరాల నియంత్రణలో పోలీసుల సమర్థత ప్రశంసనీయం.

News December 29, 2025

REWIND: ఈ ఏడాది గుంటూరు జిల్లాలో క్రూరమైన ఘటన ఇదే..!

image

గుంటూరు జిల్లాలో ఈ ఏడాది జరిగిన నేరాల్లో ఫిరంగిపురంలో చోటుచేసుకున్న చిన్నారి హత్య అత్యంత హృదయవిదారక ఘటనగా మిగిలిపోయింది. మార్చి 29న ప్రకాశం పంతులు కాలనీలో సవతి తల్లి లక్ష్మి కిరాతకానికి ఆరేళ్ల కార్తీక్ బలైపోయాడు. పసివాడని కూడా చూడకుండా గోడకేసి కొట్టి చంపిన తీరు ప్రజలను కంటతడి పెట్టించింది. మరో చిన్నారిని సైతం పెనంపై కూర్చోబెట్టి హింసించిన లక్ష్మి రాక్షసత్వం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.