News April 16, 2025

గుంటూరు జిల్లాకు కొత్త ఎస్సీ కార్పొరేషన్ ఈడీ

image

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో భాగంగా 16 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కే. శ్రీనివాస్‌ను నియమించారు. సామాజిక న్యాయాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ నియామకం కీలకంగా భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న శాఖల్లో కొత్త బాధ్యతలు చేపట్టనున్న డిప్యూటీ కలెక్టర్‌లు సంబంధిత జిల్లాల్లో సేవలు అందించనున్నారు. 

Similar News

News January 5, 2026

తెనాలి సబ్ కలెక్టర్ గ్రీవెన్స్‌కు 7 ఫిర్యాదులు

image

తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 7 ఫిర్యాదులు వచ్చాయి. సబ్ కలెక్టర్ సంజనా సింహ వేరే అధికారిక కార్యక్రమానికి వెళ్లడంతో కార్యాలయ అధికారులే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ 1, మున్సిపాలిటీ 2, దేవాదాయ శాఖ 1, పంచాయతీ రాజ్ విభాగానికి 3 అర్జీలు చొప్పున మొత్తం 7 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిని ఆయా విభాగాలకు పంపి పరిష్కరిస్తామని తెలియజేశారు.

News January 5, 2026

GNT: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10:35 గంటలకు గుంటూరులోని శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీకి చేరుకుంటారు. అక్కడ 10:45 గంటలకు జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:50 గంటలకు సచివాలయానికి వస్తారు. సాయంత్రం 4:30 గంటలకు ఆర్టీజీఎస్‌పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.

News January 5, 2026

నేడు గుంటూరుకు సీఎం చంద్రబాబు రాక

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు రానున్నారు. ఉదయం 10:25 ని.లకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడి నుండి బయలుదేరి ఉదయం 10:35 ని.లకు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు బందోబస్త్ ఏర్పాట్లు చేశారు.