News January 26, 2025
గుంటూరు జిల్లాలో నేడు ఆ రెండు బంద్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం మద్యం, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం ఉదయం తెరుచుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం, మాంసం విక్రయించే దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశాయి. నేడు ఆదివారం కావడంతో మందు, ముక్కతో వీకెండ్ను ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని పలువురు అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Similar News
News October 31, 2025
పంట పొలాల్లో వర్షపు నీటిని బయటకు పంపాలి: కలెక్టర్

పంటపొలాల్లో వర్షపు నీటిని బయటకు పంపాలని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులు, నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పంట దెబ్బతినకుండా కాపాడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేసి ఉన్నారని గుర్తు చేశారు. జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
News October 31, 2025
వరకట్న నిషేధ చట్టంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

వరకట్న నిషేధ చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. వరకట్న నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగింది. గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. యువతలో ఎక్కువగా అవగాహన కల్పించాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
News October 31, 2025
పెదకాకాని మండలం తెనాలి డివిజన్లోకి.?

జిల్లా పునర్విభజనపై క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ప్రకారం పెదకాకాని మండలం తెనాలి రెవెన్యూ డివిజన్లోకి మారే అవకాశం ఉందని సమాచారం. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే డివిజన్లో ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనతో ఈ మార్పు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం పొన్నూరు నియోజకవర్గం గుంటూరు, తెనాలి డివిజన్లలో విభజింపబడి ఉండటంతో పెదకాకాని మార్పుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.


