News March 29, 2024
గుంటూరు జిల్లాలో సీనియర్లు లేకుండానే బరిలోకి TDP
గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు TDP కూటమి అభ్యర్థులను ప్రకటించింది. ఈసారి పలువురు సీనియర్లు లేకుండానే TDP ఎన్నికలకు వెళ్తోంది. వయోభారంతో రాయపాటి బ్రదర్స్ రాజకీయాలకు దూరం కాగా, ఆలపాటి రాజా, కొమ్మలపాటి శ్రీధర్లకు టికెట్లు దక్కలేదు. మరోవైపు, కోడెల శివప్రసాద్ వారసుడికి కూడా టికెట్ కేటాయించలేకపోయారు. ఆలపాటి ఆశించిన టికెట్ నాదెండ్ల మనోహర్కి, పెదకూరపాటు టికెట్ భాష్యం ప్రవీణ్కు దక్కిన విషయం తెలిసిందే.
Similar News
News January 19, 2025
గుంటూరు: దేహదారుడ్య పరీక్షల్లో 312 మంది ఉత్తీర్ణత
కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షల్లో 312 మంది ఉత్తీర్ణత సాధించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న పరీక్షల్లో శనివారం 529 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పలు దశల్లో కొందరు అనర్హులుగా మిగిలారు. దీంతో మొత్తం 434 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో చివరికి 312 మంది అర్హత పొందారు. అదనపు ఎస్పీలు జీవీ రమణ మూర్తి, ఎ. హనుమంతు పరీక్షలను పరిశీలించారు.
News January 18, 2025
మంగళగిరి: పవన్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ కలకలం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసు అయిన మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం సమయంలో కార్యాలయంపై ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దాదాపు 20నిమిషాలు పాటు డ్రోన్ ఎగిరినట్లు కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. దీంతో ఉలిక్కిపడిన సిబ్బంది వెంటనే డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.
News January 18, 2025
NTRకు భారతరత్న ఇచ్చేలా కేంద్రంతో చర్చలు: లోకేశ్
రాజకీయాల్లోకి వచ్చిన 9నెలల్లో ప్రభంజనం సృష్టించి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో తల్లి భువనేశ్వరితో కలిసి లోకేశ్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు తలెత్తుకు తిరిగేలా చేశారని కొనియాడారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.