News September 25, 2024

గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు

image

గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబును నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా మందపాటి శేషగిరిరావు ఉన్నారు. కాగా గుంటూరు జిల్లా వైసీపీ ముఖ్యనేతలతో జగన్ తాడేపల్లిలో నేడు సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

Similar News

News February 26, 2026

సమర్థవంతంగా మ్యూటేషన్ చేయాలి: కలెక్టర్

image

తప్పులు లేని మ్యుటేషన్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. రెవెన్యూ అధికారుల సమావేశం గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మ్యుటేషన్ ఒకటికి రెండు సార్లు పరిశీలించి చేయాలన్నారు. మ్యుటేషన్ అనే అంశం రెవెన్యూ శాఖకు ప్రాథమిక విధి అన్నారు. ఎటువంటి తప్పులు దొర్లినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.

News February 26, 2026

డోలిమోతల నడుమ ప్రసవించడం బాధాకరం: రాయపాటి శైలజ

image

అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని మల్లిపాడు గ్రామానికి చెందిన సుమిత్ర డోలిమోతల నడుమ టార్చి లైట్ వెలుగుల్లో ప్రసవించడం బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. గిరిజన గర్భిణీలను ప్రసవానికి 15 రోజుల ముందే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చి వైద్యుల పర్యవేక్షణలో సుఖ ప్రసవా జరిగే కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు.

News February 26, 2026

GNT: గురుకుల్లాల్లో ప్రవేశాలు.. పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

AP గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గురువారం కలెక్టరేట్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. 5వ తరగతిలో ప్రవేశానికి, 6,7, 8  తరగతులలో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశానికి, ఇంటర్మీడియట్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మార్చి 31 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులు చేయవచ్చన్నారు.