News September 25, 2024
గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు

గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబును నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా మందపాటి శేషగిరిరావు ఉన్నారు. కాగా గుంటూరు జిల్లా వైసీపీ ముఖ్యనేతలతో జగన్ తాడేపల్లిలో నేడు సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
Similar News
News November 21, 2025
GNT: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత దేవిప్రియ వర్ధంతి

ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు దేవిప్రియ (షేక్ ఖాజాహుస్సేన్) వర్ధంతి నేడు. గుంటూరులో జన్మించిన ఆయన ‘పైగంబర కవుల’ బృందంలో ఒకరు. ఆయన రచించిన ‘గాలిరంగు’ కవిత్వానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన పాత్రికేయుడిగా ‘ఉదయం’, ‘ఆంధ్రజ్యోతి’ వంటి దినపత్రికలలో పనిచేశారు. వ్యంగ్య, విమర్శనాత్మకమైన ఆయన ‘రన్నింగ్ కామెంటరీ’ కవిత్వం తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది.
News November 21, 2025
GNT: మీసాల కృష్ణుడు బెల్లంకొండ సుబ్బారావు వర్ధంతి

ప్రముఖ రంగస్థల నటుడు, న్యాయవాది బెల్లంకొండ సుబ్బారావు వర్ధంతి నేడు. ఆయన 1902లో కారంపూడిలో జన్మించారు. 1952 నవంబర్ 21న పరమపదించారు. సుబ్బారావు నాటక రంగంలో శ్రీకృష్ణుడి పాత్రకు జీవం పోశారు. పాండవోద్యోగ విజయాలు నాటకంలో ఆయన కృష్ణ పాత్రధారణ తారాస్థాయిని అందుకుంది. కృష్ణ వేషధారణలో మీసాలు ధరించడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన్ను మీసాల కృష్ణుడు అని పిలిచేవారు. శ్రీకృష్ణ పాత్రకు అంకితమైన నటుడిగా పేరు పొందారు.
News November 21, 2025
Way2Newsలో వార్త.. నేడు మంత్రి పర్యటన

రాజధాని గ్రామాల్లో గత ప్రభుత్వంలో నిర్మించిన వెల్నెస్ సెంటర్లు నిరుపయోగంగా ఉన్నాయంటూ ఈ నెల 18వ తేదీన Way2Newsలో వార్త పబ్లిష్ అయ్యింది. స్పందించిన మంత్రి నారాయణ శుక్రవారం ఉదయం 8 గంటలకు రాజధాని గ్రామాల్లో CITIIS ప్రాజెక్ట్ కింద చేపట్టిన అంగన్వాడీ సెంటర్లు, స్కూల్స్, హెల్త్ సెంటర్లను పరిశీలించనున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరి కాసేపట్లో మంత్రి పర్యటన అప్డేట్ Way2Newsలో చూడొచ్చు.


