News March 27, 2025
గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం వాయిదా

ఈనెల 29వ తేదీన గుంటూరులో జరగనున్న ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా బుధవారం తెలిపారు. 2025-26వ సంవత్సర బడ్జెట్లో ప్రభుత్వ పథకాలను అదనంగా చేర్చ వలసి ఉన్నందున అదే విధంగా మెజార్టీ సభ్యులు కొంత సమయం కోరిన కారణంగా వాయిదా వేసినట్లు ఛైర్పర్సన్ తెలిపారు.
Similar News
News April 2, 2025
బస్సుల అనుమతులకు రిమార్కులు అందించండి- కలెక్టర్

రవాణా శాఖ అధికారులతో గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. గుంటూరులో ప్రైవేటు సిటీ బస్సుల రూట్ల అనుమతులకు సంబంధించి సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టర్, ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. సిటీ బస్సుల అనుమతులకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ఏప్రిల్ 9 నాటికి రిమార్కులు అందించాలని ఆదేశించారు. అనంతరం అనుమతుల మంజూరుకు ఆర్టీఏ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు.
News April 2, 2025
తాడేపల్లిలో వైఎస్ జగన్ కీలక సమావేశం

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశానికి వివిధ జిల్లాల నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన వారిని అభినందించిన జగన్, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రజల్లో కొనసాగాలని నేతలకు సూచించారు.
News April 2, 2025
వెలగపూడిలో తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం సమీక్ష

తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం నారా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ సమీక్షకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హాజరయ్యారు. సమావేశంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆలయ భద్రత, దర్శన వ్యవస్థలో మార్పులు, భక్తుల వసతి ఏర్పాట్లు వంటి అంశాలపై సీఎం చర్చించారు.