News April 14, 2025

గుంటూరు: టిడ్కో గృహాల్లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

image

నల్లపాడు టిడ్కో గృహాల్లో 17 ఏళ్ల షేక్ నగ్మా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫలితాల్లో ఆమెకు 780 మార్కులు వచ్చాయి. అయితే ఆమె మైగ్రేన్ బాధతో ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. ఆ రోజు తల్లిదండ్రులు చిన్న కుమార్తెతో కలిసి బయటికి వెళ్లిన వేళ, ఏమైందో తెలీదు కానీ ఇంట్లో ఒంటరిగా ఉన్న నగ్మా ఉరివేసుకుంది. ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులకు ఆమె మృతదేహంలా కనిపించింది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.  

Similar News

News April 17, 2025

GNT: బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడిగింపు

image

ఫిరంగిపురం PSలో నమోదైన కేసులో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు నరసరావుపేట కోర్టు రిమాండ్‌ను ఈ నెల 28 వరకు పొడిగించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లపై సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనిల్‌ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అనిల్ రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది.

News April 16, 2025

GNT: బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడిగింపు

image

ఫిరంగిపురం PSలో నమోదైన కేసులో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు నరసరావుపేట కోర్టు రిమాండ్‌ను ఈ నెల 28 వరకు పొడిగించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లపై సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనిల్‌ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అనిల్ రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది.

News April 16, 2025

గుంటూరు జిల్లాపై కందుకూరి వీరేశలింగం ప్రభావం

image

తెలుగు సామాజిక సంస్కర్త కందుకూరి వీరేశలింగం గుంటూరు జిల్లాపై గొప్ప ప్రభావం చూపారు. 1902లో ఉన్నవ దంపతులు గుంటూరులో నిర్వహించిన మొదటి వితంతు పునర్వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. బాలికల విద్య, స్త్రీ సాధికారత కోసం పాఠశాలలు స్థాపించడంతోపాటు, బాల్య వివాహాలు, వరకట్నం వంటి సంప్రదాయాలను వ్యతిరేకించారు. ఆయన సంస్కరణలు నేటికీ ప్రాంతీయ సామాజిక వికాసానికి దోహదపడుతున్నాయి.

error: Content is protected !!