News October 22, 2024

గుంటూరు: డీఎస్సీ ఉచిత శిక్షణకు గడువు పెంపు

image

డీఎస్సీ-2024కి హాజరయ్యే షెడ్యూల్డ్ కులాలు, తెగల అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 25 వరకు పొడిగించినట్లు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడు మధుసూదనరావు తెలిపారు. అభ్యర్థులను స్థానిక సచివాలయంలో 6 ప్రామాణిక అంశాలను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుకు ఎంపిక చేస్తారన్నారు. jnanbhumi.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నవంబరు 3న ఆన్‌లైన్లో ప్రాథమిక పరీక్ష ఉంటుంది.

Similar News

News October 15, 2025

తెనాలిలో పెరుగుతున్న క్రైమ్ రేటు!(1/2)

image

ప్రశాంతంగా ఉంటున్న తెనాలిలో పరిస్థితి 3 మర్డర్లు..6 చోరీలు అన్నట్లుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. గత 7 నెలల కాలంలో వేర్వేరు కారణాలతో ఏడుగురు హతమయ్యారు. చెంచుపేటలో ఇవాళ జరిగిన హత్య లాగానే కొన్ని నెలల క్రితం పండ్ల వ్యాపారిని దారుణంగా కత్తితో నరికి హత్య చేశారు. తర్వాత ముత్తింశెట్టిపాలెంలో మహిళ హత్య, పరిమి రోడ్డులో డబుల్ మర్డర్, పినపాడులో ఒకటి, వార్ఫ్ రోడ్డులో ఇంకో హత్య జరిగాయి.

News October 15, 2025

తెనాలిలో హెచ్చుమీరుతున్న నేరాలు…(2/2)

image

తెనాలి చెంచుపేటలో మంగళవారం పట్టపగలే హోటల్ వద్ద టిఫిన్ తింటున్న కోడితాడిపర్రుకు చెందిన జూటూరి తిరుపతిరావుని పాత కక్షలతో దారుణంగా హత్య చేశారు. ఇలా వరుస హత్యోదంతాలతో పాటు తరచూ జరుగుతున్న చోరీలు, కొట్లాటలు తెనాలి ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం రౌడీషీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మళ్లీ అదే తరహాలో నేర తీవ్రతను తగ్గించడానికి పోలీసులు నిఘా మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

News October 15, 2025

గుంటూరు: ఆటో డ్రైవర్‌కు మూడు నెలల జైలు శిక్ష

image

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ కోటి వెంకట రెడ్డికి గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు మంగళవారం 3 నెలల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. 2016లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు సాక్ష్యాలను సమర్పించడంతో నిందితుడు దోషిగా తేలాడు. విచారణలో ఎస్ఐ అమీర్, ఏపీపీ శౌరి కృషి చేశారు. ఎస్పీ పోలీసులను అభినందించారు.