News March 29, 2025
గుంటూరు: నైట్ ఫుడ్ కోర్ట్ విషయంలో చర్చ.!

కరోనా ముందు వరకు నైట్ ఫుడ్ కోర్ట్ హిందూ కళాశాల సెంటర్లో నడిచింది. మార్కెట్కు సరుకు తెచ్చే రైతులు, ఆసుపత్రులకు, బస్టాండ్, రైల్వే స్టేషన్కు దగ్గరగా ఉండటంతో బాగా నడిచిందని, ఇప్పుడు వీటన్నిటికీ దూరంగా బ్రాడీపేట, అరండల్ పేటలో ఫుడ్ కోర్టును నిర్వహిస్తే అంత ప్రయోజనకరంగా ఉండదని ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు మరోసారి పునరాలోచించి హిందూ కళాశాల రోడ్డులోనే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు.
Similar News
News October 17, 2025
గుంటూరులో గణనీయంగా తగ్గుతున్న దారిద్ర్యం

గుంటూరు జిల్లా పేదరికం తగ్గుదలపై నీతి ఆయోగ్ నిర్వహించిన జాతీయ బహుముఖ పేదరిక సూచీ (MPI)–2023 సర్వే ప్రకారం, గుంటూరు జిల్లాలో పేదరికం గణనీయంగా తగ్గింది.2015–16లో 8.51% మంది బహుముఖ పేదరికంలో ఉండగా, 2019–21 నాటికి ఇది 4.36%కి పడిపోయింది. ఇది దాదాపు 4.15 శాతం పాయింట్ల మెరుగుదల. విద్య, ఆరోగ్యం, శానిటేషన్ రంగాల్లో పురోగతి ఈ ఫలితాలకు దారితీసింది.
@నేడు అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినోత్సవం
News October 17, 2025
GNT: అంగన్వాడీ అద్దె బకాయిలు రెండు రోజుల్లో జమ

గుంటూరు జిల్లాలోని ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాల అద్దె బకాయిలను రెండు రోజుల్లోకార్యకర్తల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి పి.వి.జి. ప్రసున తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే బకాయిల విడుదలకు బడ్జెట్ను విడుదల చేసిందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై సిబ్బందికి తెలియజేయాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు.
News October 16, 2025
అమరావతి రైతులకు ముఖ్య సూచన

అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం తుళ్లూరులోని CRDA కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే గ్రీవెన్స్ డేను రైతులు, అమరావతి ప్రాంతవాసులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. భూములిచ్చిన రైతుల సమస్యలను “గ్రీవెన్స్ డే” ద్వారా CRDA అధికారుల దృష్టికి తీసుకురావొచ్చు అని అన్నారు.