News December 27, 2024

 గుంటూరు పరేడ్ గ్రౌండ్‌లో దేహధారుడ్య పరీక్షలు

image

పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహధారుణ్య పరీక్షలకు గుంటూరు పోలీస్ పరేడ్ మైదానాన్ని సిద్ధం చేయమని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఐపీఎస్ ఆదేశించారు. డిసెంబర్ 30న పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం నగరంలోని మైదానాన్ని ఎస్పీ పరిశీలించారు. అభ్యర్థులకు ప్రతి పరీక్ష ఘట్టం అర్థమయ్యే రీతిలో మైదానంలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు SPలు GV రమణమూర్తి, సుప్రజ పాల్గొన్నారు.

Similar News

News January 24, 2025

నిఘా పెట్టి.. నేరాలు నియంత్రణ చేయాలి: ఎస్పీ

image

గుంటూరు జిల్లా నేర విభాగం పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ సతీష్ కుమార్ తనిఖీ చేశారు. నేరాల దర్యాప్తు, చోరీకి గురైన సొమ్ము రికవరీ తీరు తదితర అంశాల గురించి అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాలు జరగకుండా తగిన నిఘా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జైలు నుంచి వచ్చిన నేరస్తులు, దొంగల కదలికలపై నిఘా పెట్టి నేరాలు జరుగకముందే వాటిని కట్టడి చేయాలన్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ సుప్రజ ఉన్నారు.

News January 24, 2025

 గుంటూరు: మూడు రోజులు పోలీసు కస్టడీకి తులసి బాబు

image

RRRను చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసి బాబును మూడు రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ శుక్రవారం ఆదేశించారు. నగరంపాలెం పోలీసులు దాఖలు చేసిన ఈ కేసులో ఒంగోలు ఎస్పీ విచారణాధికారి. ఐదు రోజుల కస్టడీకి పిటీషన్ దాఖలు చేయగా, తులసి తరఫు న్యాయవాదులు అందుకు నిరాకరించారు. కేసు పూర్వపరాలు, వాదోపవాదాల అనంతరం మూడు రోజుల కస్టడీకి అనుమతించారు.

News January 23, 2025

మాచవరం: సరస్వతి భూముల వివాదం ఇదే

image

పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ కుటుంబానికి సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌కి భూములు కేటాయించారు. వారికి కేటాయించిన భూముల్లో అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. గత నవంబరులో ఈ వ్యవహారంపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహించి ఇందులో భాగంగా వేమవరం, పిన్నెల్లి గ్రామాల్లో 24.84 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు.