News March 29, 2025

గుంటూరు: పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్‌ల పేరుతో మోసాలు జాగ్రత్త: ఎస్పీ

image

పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్‌ల పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనల పట్ల గుంటూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. లైక్, షేర్ చేస్తే రివ్యూలు ఇస్తే డబ్బులు చెల్లిస్తామని మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతారని జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డయల్ 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. 

Similar News

News November 18, 2025

మంగళగిరి: భార్యను హత్య చేసిన భర్త

image

మంగళగిరి పరిధి యర్రబాలెంలో వివాహిత హత్యకు గురైంది. CI బ్రహ్మం, SI వెంకట్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. వారి వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన కిలిమి లక్ష్మీ (29) 5 ఏళ్ళ క్రితం శంకర్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. కలహాలతో విడిపోయి, చినకాకానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తూ యర్రబాలెంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త శంకర్ రెడ్డి గొంతునులిమి హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

News November 18, 2025

ANU: LLB రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన LLB రీవాల్యుయేషన్ ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. LLB VI, X సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధించిన అధికారులను సంప్రదించాలన్నారు.

News November 18, 2025

ANU: LLB రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన LLB రీవాల్యుయేషన్ ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. LLB VI, X సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధించిన అధికారులను సంప్రదించాలన్నారు.