News July 29, 2024
గుంటూరు: పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

ఆగస్ట్ 1వ తేదీనే పింఛన్లు నూరు శాతం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో మొత్తం 2,60,192 మందికి రూ.110.69కోట్లు పంచాల్సి ఉంది. జిల్లాలో గత నెలలో పింఛన్ పంపిణీలో 4664 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఆగస్ట్ నెలలో ఒక్కో ఉద్యోగికి 50-100 మంది ఉండేలా మ్యాపింగ్ చేస్తున్నారు.
Similar News
News December 6, 2025
‘రహదారి భద్రతా, డిఫెన్సివ్ డ్రైవింగ్’పై శిక్షణ

అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (AIUDP) అమలు కార్యకలాపాలలో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కోసం APCRDA కార్యాలయంలో కాంట్రాక్టర్స్ సిబ్బందికి “రహదారి భద్రతా & డిఫెన్సివ్ డ్రైవింగ్”పై శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రమాదాలకు గురయ్యే వారి రక్షణ ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదాల నివారణకు పాటించాల్సిన విధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.
News December 6, 2025
GNT: గర్భందాల్చిన ఇంటర్ విద్యార్థిని.. యువకుడిపై కేసు నమోదు

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చడానికి కారణమైన పొట్టిశ్రీరాములునగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిపై అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. PS నగర్కి చెందిన విద్యార్థినికి అదే ప్రాంతానికి చెందిన నాని అనే యువకుడు మాయమాటల చెప్పి లోబరుచుకున్నాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
News December 6, 2025
GNT: రూ.10కి వ్యర్థాలు ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం

ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చేపల చెరువుల్లో నిషేధిత చికెన్ పేగులు, హోటల్ వ్యర్థాల వాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో చేపల మేత కోసం వ్యర్థాలను కిలో రూ.10 చొప్పున కొని ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గోదావరి జిల్లాల్లో నిషేధించిన ఈ వ్యర్థాలను ఇక్కడ మాత్రం గోప్యంగా కొనసాగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి వ్యర్ధాలను నిషేధించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


