News March 28, 2024
గుంటూరు: ప్రశాంతంగా ముగిసిన టెన్త్ పరీక్షలు

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు బుధవారం ముగిశాయి. ఎటువంటి పొరపాటుకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి. బుధవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 147 కేంద్రాల పరిధిలో కేటాయించిన 27,934 మంది విద్యార్థులకు గానూ 27,284 మంది హాజరయ్యారు. 46 కేంద్రాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
Similar News
News March 19, 2025
రాజశేఖర్ టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం?

వైసీపీ MLC మర్రి రాజశేఖర్ బుధవారం రాజీనామా పత్రాన్ని స్పీకర్కు అందజేశారు. పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఇటీవల జగన్ పెట్టిన ఉమ్మడి గుంటూరు జిల్లా సమావేశానికి సైతం హాజరు కాలేదు. విడదల రజనీకి చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పడమూ ఇందుకు ఓ కారణం. పల్నాడులో కీలక నేతను కోల్పోవడం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమని విశ్లేషకులు అంటున్నారు. ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
News March 19, 2025
వైసీపీకి మర్రి రాజశేఖర్ రాజీనామా

YCPకి MLC మర్రి రాజశేఖర్ రాజీనామా చర్చనీయాంశమైంది. 2004లో చిలకలూరిపేటలో ఇండిపెండెంట్గా గెలిచిన ఆయన 2010లో YCPలో చేరారు. 2014లో MLAగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం YCP జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2018లో జగన్ పాదయాత్రలో కీలకంగా పనిచేశారు. కాగా 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా విడదల రజనీ ఉన్నారు. పార్టీలో గుర్తింపు లేదని ఆయన అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.
News March 19, 2025
గుంటూరు మేయర్ ఎంపికపై ఉత్కంఠ

కావటి మనోహర్ మేయర్ పదవికి రాజీనామా చేయడంతో గుంటూరులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీంతో తాత్కాలిక మేయర్ రేసులో కోవెలమూడి, కొందరు సీనియర్ కార్పొరేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్నవారిని తాత్కాలిక మేయర్గా నియమిస్తారు. దీంతో కూటమి తరఫున సజీలను నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె కంటే తానే సీనియర్ని అని డైమండ్ బాబు(YCP) అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది.