News December 11, 2024
గుంటూరు: బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్(థియరీ) పరీక్షలను 2025 జనవరి 22 నుంచి నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 2025 జనవరి 1లోపు అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News November 24, 2025
మహిళా సంఘాల విజయ గాథలు ‘అవని’: కలెక్టర్

మెప్మా మహిళా సంఘాలు సాధించిన విజయగాధలు ‘అవని’ సంచికలో మనమందరం చదవి స్ఫూర్తి పొందవచ్చని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మెప్మా వార్షిక సంచిక ‘అవని’ కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళ పారిశ్రామిక విప్లవానికి గట్టి పునాదులు పడుతున్నాయన్నారు. మెప్మా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, కొత్త అవకాశాలను చూపిస్తూ ముందుకు సాగాలన్నారు.
News November 24, 2025
GNT: నేడు వంగర వెంకట సుబ్బయ్య జయంతి

తెలుగు సినిమా, నాటక రంగాలలో ప్రసిద్ధి చెందిన హాస్యనటుడు వంగర వెంకట సుబ్బయ్య జయంతి నేడు. ఆయన 1897, నవంబర్ 24న సంగం జాగర్లమూడిలో జన్మించారు. రంగస్థల ప్రస్థానంలో తెనాలిలో స్థిరపడి, ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకంలో వసంతకుడి వేషంతో కళాహృదయుల మన్ననలు అందుకున్నారు. ఆయన దాదాపు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. ‘పెద్దమనుషులు’, ‘కన్యాశుల్కం’, ‘మాయాబజార్’ వంటి చిత్రాలలో తన హాస్యంతో ప్రేక్షకులను అలరించారు.
News November 24, 2025
పీజీఆర్ఎస్ సద్వినియోగం చేస్కోండి: కలెక్టర్

Meekosam.ap.gov.inలో PGRS అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. నేరుగా పీజీఆర్ఎస్లో కూడా అందించవచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని చెప్పారు. అర్జీ స్థితి గతులను 1100 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.


