News April 2, 2025
గుంటూరు: మద్యం సీసాతో దాడి.. ఒకరి మృతి

గుంటూరు శివారు రెడ్డిపాలెంలో ఒకరు హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామ్ నాయక్ (60) కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తాడు. రాజుతో కలిసి ఇద్దరు మద్యం తాగారు. ఇద్దరి మద్య వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాజు మద్యం బాటిల్తో రామ్నాయక్పై దాడి చేశాడు. దీంతో రామ్ నాయక్ స్పాట్లోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 8, 2026
వేములవాడ: కన్నుల పండువగా.. వీనుల విందుగా..! ….

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీత్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాల తొలిరోజు కార్యక్రమాలు కన్నుల పండువగా, వీనుల విందుగా సాగాయి. సాయంత్రం అనుపమ హరిబాబు బృందం శాస్త్రీయ సంగీత కచేరి, వి.జానకి బృందం శాస్త్రీయ సంగీతంతో సంగీతాభిమానులను అలరించారు. వి.నవ్యభారతి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగా శివపార్వతి భాగవతారిణి హరికథ ఆకట్టుకుంది.
News January 8, 2026
హన్మకొండ పరిధిలో 22 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు

హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 22 ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో 14 మంది మద్యం తాగిన వారితో పాటు మరో 8మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారు ఉన్నారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి తెలిపారు. ఈ కేసులపై కోర్టు జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News January 8, 2026
సిరిసిల్ల: ‘ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి’

ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని జిల్లా జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ అన్నారు. సిరిసిల్లలో రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. మొబైల్ వాడుతూ వాహనాలు నడపవద్దన్నారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికావద్దని సూచించారు. శ్రీనివాసరావు, దిలీప్, భాస్కర్, వేణు, తిరుపతి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.


