News October 9, 2024

గుంటూరు: మిర్చి యార్డుకు 3రోజులు దసరా సెలవులు

image

మిర్చియార్డు (గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ)కి ఈ నెల 11 నుంచి 13వరకు 3రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించినట్లు పర్సన్ ఇన్‌ఛార్జ్ శ్రీనివాసరావు, సెక్రటరీ ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈ నెల 11వ తేదీన శుక్రవారం దుర్గాష్టమి, 12న శనివారం విజయదశమి, 13న ఆదివారం సాధారణ సెలవుదినమని అన్నారు. తిరిగి ఈ నెల 14వ తేదీ సోమవారం ఉదయం నుంచి యార్డులో లావాదేవీలు పునఃప్రారంభమవుతాయని చెప్పారు.

Similar News

News December 24, 2025

GNT: జమాబందీ లేక భూ రికార్డుల్లో గందరగోళం

image

గుంటూరు జిల్లా రెవెన్యూ శాఖలో కీలకమైన జమాబందీ ప్రక్రియను కొన్నేళ్లుగా నిర్వహించకపోవడంతో భూమి రికార్డులు గందరగోళంగా మారాయి. తహశీల్దార్ కార్యాలయాల్లో ఆర్వోఆర్ నిర్వహణ సరిగా లేకపోవడం, కంప్యూటర్ ఆపరేటర్లపై పూర్తిగా ఆధారపడటం వల్ల అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. ఏటా జమాబందీ జరిగితే భూమి హక్కులు స్పష్టమవుతాయి. కానీ అది లేకపోవడంతో జిల్లాలో భూవివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

News December 24, 2025

GNT: ఆస్తి నీటి పన్నులు వసూళ్లలో వెనుకబడిన జిల్లా

image

గుంటూరు GMC సహా జిల్లాలోని మున్సిపాల్టీల్లో ఆస్తి, నీటి పన్నులు రూ.510.41 కోట్లు వసూలు చేయాలి. ఇప్పటి వరకు 29.14 శాతం అంటే 148.74 కోట్లు వసూలు చేశారు. ఒక్క గుంటూరు కార్పొరేషన్లోనే రూ.260.29 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇక్కడ 25.55 శాతమే వసూలు కావడం గమనార్హం. గత ఏడాది కంటే పన్ను వసూళ్లలో వెనుకబడి ఉంది. తెనాలిలో 41.79, మంగళగిరి – తాడేపల్లిలో 62.29, పొన్నూరులో 49.01 శాతం వసూలు చేశారు.

News December 24, 2025

GNT: రైల్వే లైన్ భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల

image

నంబూరు – ఎర్రుపాలెం వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ కోసం మరో 300 ఎకరాలు భూ సేకరణ కోసం రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. NTR జిల్లాలోని 8 గ్రామాల్లో భూ సేకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా భూ సేకరణ చట్టం ద్వారా భూములు తీసుకుంటే నష్టపోతామని ఇప్పటికే తాడికొండ రైతులు అభ్యంతరం తెలిపారు. భూ సమీకరణ ద్వారా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. 2024 డిసెంబర్ 21న ప్రకటన ఇచ్చారు.