News May 11, 2024
గుంటూరు: యార్డులో 60,876 బస్తాల మిర్చి విక్రయం

మార్కెట్ యార్డుకు శుక్రవారం 51,030 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 60,876 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్-5, 273, 341, 4884, సూపర్-10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ.17,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 20,000 వరకు లభించింది.
Similar News
News January 8, 2026
తెనాలి: విద్యార్ధి ఆత్మహత్యకు కారణలివేనా?

వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థి రాఘవేంద్ర వెంకట్ బుధవారం కాలేజీ టాయిలెట్లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తెనాలి(M) నందివెలుగుకి చెందిన అతడి ఆత్మహత్యకు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, బ్యాక్ లాగ్స్ కారణమని తెలుస్తోంది. రోజు మాదిరిగా కాలేజీకి వచ్చిన వెంకట్ మధ్యలో స్నేహితుడు బైక్ తీసుకుని వెళ్లి బాటిల్లో పెట్రోల్ తెచ్చుకొని టాయిలెట్లో నిప్పు అంటించుకున్నట్లు సమాచారం.
News January 8, 2026
గుంటూరులో నేడు సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే.!

సీఎం చంద్రబాబు జనవరి 8న గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి అమరావతిలోని సెక్రటేరియట్కు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా గుంటూరుకు రాగా, నల్లపాడు రోడ్డులోని రెడ్డి కాలేజ్ సమీపంలో నిర్వహించే సరస్ మేళా ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం విజయవాడ పున్నమి ఘాట్లో ‘ఆవకాయ-అమరావతి’ కార్యక్రమానికి హాజరై రాత్రి తిరిగి నివాసానికి చేరుకుంటారు.
News January 8, 2026
గుంటూరులో నేడు సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే.!

సీఎం చంద్రబాబు జనవరి 8న గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి అమరావతిలోని సెక్రటేరియట్కు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా గుంటూరుకు రాగా, నల్లపాడు రోడ్డులోని రెడ్డి కాలేజ్ సమీపంలో నిర్వహించే సరస్ మేళా ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం విజయవాడ పున్నమి ఘాట్లో ‘ఆవకాయ-అమరావతి’ కార్యక్రమానికి హాజరై రాత్రి తిరిగి నివాసానికి చేరుకుంటారు.


