News March 19, 2024
గుంటూరు రైల్వేస్టేషన్లో వ్యక్తి మృతి

గుంటూరు రైల్వేస్టేషన్లో మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై జీఆర్పి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్పై మంగళవారం ఓ వ్యక్తి మృతిచెంది ఉన్నాడనే సమాచారంతో సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతుని చేతికి సెలైన్ ఎక్కించుకున్న బ్యాండేజ్ ఉంది. మృతుడి వివరాలు తెలియరాలేదని, గుర్తుపట్టినవారు జీఆర్పి పోలీసులను సంప్రదించాలన్నారు.
Similar News
News October 28, 2025
GNT: ‘మొంథా’ ప్రభావం..ZP సమావేశంపై అనిశ్చితి

గుంటూరు జిల్లాలో మొంథా తుపాన్ కారణంగా బుధవారం జరగాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనిశ్చితిలో పడింది. వర్షాలు, గాలుల ప్రభావంతో ప్రజా ప్రతినిధుల రాకపోకలు కష్టమయ్యే పరిస్థితి నెలకొంది. గుంటూరు, బాపట్ల ప్రాంతాల్లో తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున, తగినంత మంది జెడ్పీటీసీలు హాజరు కాకపోతే సమావేశం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News October 28, 2025
GNT: మిర్చి, పసుపు యార్డులకు 2 రోజులు సెలవు

మొంథా తుపాన్ ప్రభావం కారణంగా గుంటూరు మిర్చి యార్డుకు మంగళ, బుధవారాలు సెలవు ప్రకటించారు. రైతులు సరుకు తీసుకురావద్దని మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాసరావు సూచించారు. కమిషన్ ఏజెంట్లు రహదారులపై సరుకు నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే దుగ్గిరాల పసుపు యార్డుకు కూడా 2 రోజులు సెలవు ప్రకటించారు. రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు.
News October 28, 2025
గుంటూరు జిల్లాలో తుపాను ప్రభావం

మంగళగిరి కొత్తపేట, కొలకలూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో సోమవారం మోస్తరుగా వర్షం కురిసింది. తుపానుతో గాలి వేగం పెరిగి, చలి ఎక్కువగా ఉంది. పూరి గుడిసెలు, శిథిల భవనాలు ఖాళీ చేసి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కలెక్టర్ పర్యటనలో ప్రమాదం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా, ప్రజలు ఇళ్లలో ఉండాలని, అవసరాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.


