News October 15, 2024

గుంటూరు రైల్వే ఓవర్ బ్రిడ్జికి నిధులు.. గడ్కరీకి చంద్రబాబు కృతజ్ఞతలు

image

గుంటూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి రూ.98 కోట్లు కేంద్ర మంత్రి గడ్కరీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. గుంటూరు అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవతో గడ్కరి చేసిన ప్రకటన ఎన్నో ఏళ్ల గుంటూరు వాసుల కల నెరవేర్చనుంది.

Similar News

News January 6, 2026

తెనాలిలో ఉద్రిక్త వాతావరణం

image

తెనాలి వహాబ్ చౌక్‌లో ఉద్రిక్తత నెలకొంది. డివైడర్ మధ్యలో ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రయత్నించడంతో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. నాయకులు, కార్యకర్తలు భారీగా వహాబ్ చేరుకొని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కుట్రపూరితంగా ఫ్లెక్సీలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.

News January 6, 2026

GNT: ‘స్వీకారం’ కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం

image

జిల్లాలో SC, ST, BC, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు ‘స్వీకారం’ పేరుతో కలెక్టర్ తమీమ్ అన్సారియా శ్రీకారం చుట్టారు. ప్రతీ వసతి గృహం ‘సంపూర్ణ ప్రగతికి చిహ్నంగా, చిన్నారుల మానసిక వికాసానికి ప్రేరణగా’ ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ వర్గాల సంస్థలతో తమీమ్ అన్సారియా మంగళవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు.

News January 6, 2026

GNT: నేడు సీఆర్డీఏ అథారిటీతో సీఎం సమావేశం

image

అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులు ఇతర విషయాలపై CRDA అథారిటీతో CM చంద్రబాబు మంగళవారం సమావేశం కానున్నారు. ముందుగా మంత్రి నారాయణ CRDA అధికారులతో సమీక్ష నిర్వహించి, మధ్యాహ్నం 2:30 నిమిషాలకు సచివాలయంలో జరిగే అథారిటీ సమావేశంలో చర్చించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి రైతుల సమస్యల త్రిసభ్య కమిటీతో CM భేటి కానున్నారు. సాయంత్రం 4 గంటలకు తీసుకున్న నిర్ణయాలు మంత్రి నారాయణ వెల్లడిస్తారు.