News May 5, 2024

గుంటూరు రైల్వే డివిజన్లో నిలిచిన పలు రైళ్లు

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నల్గొండ-పగిడిపల్లి మార్గంలో శనివారం పలు రైళ్లు నిలిచిపోయాయి. చెన్నై ఎక్స్ ప్రెస్(12603), సికింద్రాబాద్ నుంచి వస్తున్న ప్రత్యేక రైలు(00632)కు విద్యుత్తు సరఫరా అయ్యే పాంటూలు (మెయిన్ లైన్ నుంచి రైలుకు విద్యుత్ సరఫరా చేసే పరికరం) విరిగిపోవడంతో.. విష్ణుపురం స్టేషన్లో అకస్మాత్తుగా ఆగిపోయాయి. విరిగిన పరికరాలను బాగు చేసిన తర్వాత ఆ రైళ్లు అక్కడి నుంచి కదిలాయి.

Similar News

News December 6, 2025

GNT: రూ.10కి వ్యర్థాలు ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం

image

ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చేపల చెరువుల్లో నిషేధిత చికెన్ పేగులు, హోటల్ వ్యర్థాల వాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో చేపల మేత కోసం వ్యర్థాలను కిలో రూ.10 చొప్పున కొని ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గోదావరి జిల్లాల్లో నిషేధించిన ఈ వ్యర్థాలను ఇక్కడ మాత్రం గోప్యంగా కొనసాగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి వ్యర్ధాలను నిషేధించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News December 5, 2025

పారిశ్రామికవేత్తల దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

image

వివిధ పథకాలు క్రింద మంజూరైన యూనిట్లు త్వరగా ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం శుక్రవారం కలెక్టరేట్ లో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చేసుకున్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలన్నారు. ఎపిఐఐసి భూములకు సంబంధించిన దస్త్రాలు త్వరగా పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News December 5, 2025

ANU: LLB 5 సంవత్సరాల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత ఏప్రిల్ నెలల్లో జరిగిన BA LLB 5 సంవత్సరాల ఫస్ట్ సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు యూనివర్సిటీలోని సంబంధిత కార్యాలయంలోని అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.