News February 21, 2025

గుంటూరు: లాడ్జిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

image

సోదరి మృతిని జీర్ణించుకోలేక మద్యానికి బానిసైన రియల్ ఎస్టేట్ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కొత్తపేట స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలికి చెందిన రవితేజ (32) రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతని సోదరి కోవిడ్ సమయంలో చనిపోయారు. అప్పటి నుంచి మద్యానికి బానిసగా మారి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో మద్యంలో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Similar News

News February 23, 2025

ప్రిసైడింగ్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి: కలెక్టర్

image

ఏమ్మెల్సీ ఎన్నికలు సజావుగా కొనసాగేలా ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఏమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్, సెక్టార్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు.

News February 22, 2025

ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అవసరమైన సహకారం అందిస్తూ పర్యవేక్షణ చేయాలని మైక్రో అబ్జర్వర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఓటర్లలో మరింతగా కాన్ఫిడెన్స్‌ను పెంచేందుకు కృషి చేయాలని కోరారు.

News February 21, 2025

ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అవసరమైన సహకారం అందిస్తూ పర్యవేక్షణ చేయాలని మైక్రో అబ్జర్వర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఓటర్లలో మరింతగా కాన్ఫిడెన్స్‌ను పెంచేందుకు కృషి చేయాలని కోరారు.

error: Content is protected !!