News February 3, 2025
గుంటూరు: శీలంవారి వీధిలో సప్లయర్ ఆత్మహత్య

కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శీలంవారి వీధిలో ఇనుప దులానికి చీరతో ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొన్నూరు రోడ్డులోని ఓ హోటల్లో సప్లయర్గా పనిచేస్తున్న శ్రీను(50)రెండేళ్లుగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహానికి సంబంధించిన రక్త సంబంధీకుల వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని గుంటూరు కోవిడ్ ఫైటర్స్ సహాయంతో జీజీహెచ్ మార్చూరీకి తరలించామని సీఐ వీరయ్య తెలిపారు.
Similar News
News March 9, 2026
గుంటూరు బస్టాండ్లో దొంగల బీభత్సం.. పని చేయని సీసీ కెమెరాలు

గుంటూరు ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్లో గత కొన్ని నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిఘా లేకపోవడంతో నిత్యం 5 నుంచి 10 దొంగతనాలు జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. వరుస చోరీలతో భయాందోళనకు గురవుతున్న బాధితులు.. తక్షణమే స్పందించి బస్టాండ్లో కొత్త కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని వేడుకుంటున్నారు.
News March 8, 2026
టెన్నిస్లో సత్తా చాటిన గుంటూరు బిడ్డ లక్ష్మీ పోలూరి

గుంటూరులో జన్మించిన లక్ష్మీ పోలూరి టెన్నిస్లో అద్భుతాలు సృష్టించారు. మూడేళ్ల వయసులో ఆమె కుటుంబంతో సహా అమెరికా వెళ్లారు. 14 ఏళ్లకే దిగ్గజ క్రీడాకారిణి మోనికా సెలెస్ను ఓడించి ‘ఆరెంజ్ బౌల్’ టైటిల్ గెలిచారు. 15 ఏళ్ల వయసులో ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ టోర్నీలో రెండో రౌండ్కు చేరుకుని సత్తా చాటారు. తర్వాత స్టాన్ఫోర్డ్ వర్సిటీలో విద్యాభ్యాసం చేసి, యూఎస్ కాలేజియేట్ నంబర్-1గా నిలిచారు.
News March 7, 2026
ఈనెల 13 లోగా అభ్యంతరాలు తెలపాలి: లింగేశ్వర్ రెడ్డి

జోన్-III పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని స్కూల్ అసిస్టెంట్ గేడ్-II ప్రధానోపాధ్యాయ పోస్టులకు, తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేశారు. వివరాలను వెబ్ సైట్లో అందుబాటులో
ఉంచినట్లు ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి తెలిపారు. సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత డీఈవో కార్యాలయంలో తగిన ఆధారాలతో ఈనెల 13వ తేదీలోగా అందజేయాలని సూచించారు.


