News July 27, 2024
గుంటూరు: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మహోత్సవాలకు కలెక్టర్కు ఆహ్వానం

గుంటూరు ఏ.టీ అగ్రహారం 7వ లైన్లో రేపు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మహోత్సవాలు జరగనున్నాయని సేవా సమితి అధ్యక్షుడు రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనిరం కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మహోత్సవాలకు ఆహ్వానించారు. 28న ఆదివారం కల్యాణ మహోత్సవం, 29వ తేదీన ఊరేగింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో శ్రీహరి, లెనిన్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 7, 2026
GNT: గుడ్ న్యూస్.. వారికి కేవలం రూ.1కే నెలంతా ఫ్రీ

BSNLఎస్.ఆర్.సి-1 ప్లాన్ పునఃప్రారంభించినట్లు BSNLకొత్తపేట శాఖ డీజీఎం బి.శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సిమ్ కార్డు ఉచితంగా ఇవ్వడంతో పాటూ ఒక్క రూపాయితో 30 రోజుల కాలపరిమితితో అపరిమిత కాలింగ్స్, 100 సందేశాలు, 2GB డేటా ఇస్తున్నామని తెలిపారు. ఈ నెల 31వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
News January 7, 2026
GNT: డిజిటల్ టిక్కెట్కు ప్రోత్సాహం.. జనరల్ టిక్కెట్లపై రాయితీ

రైల్ వన్ యాప్ వినియోగాన్ని పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే కొత్త ప్రోత్సాహకం ప్రకటించింది. యాప్ ద్వారా కొనుగోలు చేసే జనరల్ టిక్కెట్లపై 3 శాతం తగ్గింపు ఇస్తామని సీపీఆర్వో ఏ.శ్రీధర్ గుంటూరులో మంగళవారం వెల్లడించారు. ఆన్లైన్ చెల్లింపులు చేసినప్పుడు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు. జనవరి 14 నుంచి జులై 14 వరకు ఈ సౌకర్యం అమల్లో ఉంటుంది. టిక్కెట్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడమే లక్ష్యమన్నారు.
News January 7, 2026
గుంటూరు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి సెలవుల అనంతరం స్వగ్రామాల నుంచి తిరుగు ప్రయాణం చేసే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 18న విశాఖపట్టణం నుంచి చర్లపల్లి వరకు ప్రత్యేక రైలు(08513) రాత్రి బయలుదేరి గుంటూరు మీదుగా గమ్యానికి చేరుతుంది. అలాగే 19న చర్లపల్లి నుంచి విశాఖపట్టణానికి మరో ప్రత్యేక రైలు(08514) నడుస్తుంది. పండగ రద్దీని తగ్గించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.


