News February 3, 2025
గుంటూరు: స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపు

గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులూ విజయం సాధించారు. గెలిచిన అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరంటి వర ప్రసాద్(TDP), కొమ్మినేని కోటేశ్వరరావు(TDP), నూకవరపు బాలాజీ(TDP), ముప్పవరపు భారతి(TDP), షేక్ మీరావలి(TDP), దాసరి లక్ష్మి దుర్గ(జనసేన).
Similar News
News February 9, 2026
GNT: ప్రపంచ కప్ విజేత అనురాధకు శాప్ ఛైర్మన్ సత్కారం

షూటింగ్ బాల్ ప్రపంచ కప్ విజేత పి.అనురాధ రెడ్డిని శాప్ SAAP ఛైర్మన్ రవీనాయుడు సోమవారం సత్కరించారు. ఢిల్లీలో జరిగిన 2వ ప్రపంచ కప్ పోటీల్లో ఆమె భారత్ తరపున బంగారు పతకం సాధించారు. బాపట్ల జిల్లాకు చెందిన అనురాధ.. ఛైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచినందుకు రవినాయుడు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
News February 9, 2026
సీఎం సమీక్షలో పాల్గొన్న గుంటూరు ఎస్పీ

వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర పరిపాలనపై సోమవారం కీలక సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి గుంటూరు నుంచి ఎస్పీ వకుల్ జిందాల్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ తమీమ్ అన్సారీయా, జాయింట్ కలెక్టర్ అషుతోశ్ శ్రీవాత్సవ కూడా పాల్గొన్నారు. మంత్రులు, కార్యదర్శులతో కలిసి సీఎం పలు అంశాలపై చర్చించారు.
News February 9, 2026
‘ట్రీస్కేప్స్ 2026’లో ANU ప్రతినిధుల సందడి

న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్లో జరిగిన ‘ట్రీస్కేప్స్2026’ అంతర్జాతీయ సదస్సులో ANUబృందం పాల్గొంది. ‘సౌత్ ఏషియన్ ఆగ్రోఫారెస్టీ&ట్రీస్ అవుట్సైడ్ ఫారెస్ట్స్’ అంశంపై నిర్వహించిన సదస్సులో ANU అధ్యాపకులు మనోజ్ రెడ్డి, తన్విక, విద్యార్థుల బృందం హాజరైంది. అటవీసంరక్షణ, వ్యవసాయ రంగాల్లో వస్తున్న నూతన సాంకేతిక మార్పులు, పర్యావరణ పరిరక్షణపై ప్రపంచస్థాయి నిపుణులతో కలిసి చర్చలు జరిపారు.


