News March 22, 2024
గుంటూరు: స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. కామన్ వెరైటీ సగటు ధర రూ.500, స్పెషల్ వెరైటీ సగటు ధర రూ.1,000 మేరకు పెరిగింది. రైతులు గురువారం 1,06,381 బస్తాలు యార్డుకు తరలించారు. 1,04,332 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 81,360 బస్తాలు నిల్వ ఉన్నాయి. నాన్ ఏసీ కామన్ వెరైటీలో 334, 273రకాల ధరలు పెరిగాయని అధికారులు తెలిపారు.
Similar News
News April 16, 2025
మే 2న అమరావతికి ప్రధాని మోదీ రాక

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన మే 2వ తేదీన ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 3ఏళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తిచేస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.
News April 16, 2025
గుంటూరు: సినిమాలో నటిస్తున్న ఎమ్మెల్యే

పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సినిమాలో నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న ప్రధాన పాత్ర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని దర్శకులు దిలీప్ రాజా చెప్పారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా టైటిల్ను ప్రకటించారు. సినిమా పూర్తిస్థాయి కమర్షియల్గా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తామన్నారు. దర్శకులు నరేశ్ దోనే, మణివరణ్ ఉన్నారు.
News April 16, 2025
గుంటూరు జిల్లాకు కొత్త ఎస్సీ కార్పొరేషన్ ఈడీ

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో భాగంగా 16 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కే. శ్రీనివాస్ను నియమించారు. సామాజిక న్యాయాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ నియామకం కీలకంగా భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న శాఖల్లో కొత్త బాధ్యతలు చేపట్టనున్న డిప్యూటీ కలెక్టర్లు సంబంధిత జిల్లాల్లో సేవలు అందించనున్నారు.