News February 1, 2025
గుంటూరు: 63.4% మేర జరిగిన పింఛన్ల పంపిణీ

గుంటూరు జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ శనివారం ఉదయం 10 గంటల వరకు 63.4% మేర పంపిణీ అయ్యింది. జిల్లాలో 2,53,464 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా 1,60,700 మందికి ప్రభుత్వ యంత్రాంగం పింఛన్ అందజేసినట్లు అధికారిక డాష్బోర్డు ద్వారా తెలుస్తోంది. కాగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పింఛన్ పంపిణీకి రాజకీయ పక్షాల నేతలు దూరంగా ఉన్నారు.
Similar News
News December 16, 2025
GNT: శాబర్ జెట్ను కూల్చిన ఆంధ్ర వీరుడు

1965 ఇండో-పాక్ యుద్ధంలో పాకిస్థాన్ శాబర్ జెట్ను కూల్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి తెనాలి సమీప నిజాంపట్నానికి చెందిన హవల్దార్ తాతా పోతురాజు. పాత ఎయిర్క్రాఫ్ట్ గన్తో శత్రు విమానాన్ని ఛేదించి భారత సైన్యానికి స్ఫూర్తినిచ్చారు. ఈ వీరోచిత సేవలకు రాష్ట్రపతి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ‘వీరచక్ర’ పురస్కారం అందుకున్నారు. 18 ఏళ్లకే సైన్యంలో చేరిన పోతురాజు 1975లో స్వచ్ఛంద విరమణ చేశారు.
News December 16, 2025
నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు మంగళవారం రానున్నారు. ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల కమిటీలపై స్పష్టతకు రావడమే లక్ష్యంగా టీడీపీ అధిష్ఠానం ముందడుగు వేస్తుండగా, సంస్థాగత నిర్మాణంపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లా కమిటీల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తికాగా, త్వరలోనే రాష్ట్ర కమిటీని కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.
News December 16, 2025
నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు మంగళవారం రానున్నారు. ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల కమిటీలపై స్పష్టతకు రావడమే లక్ష్యంగా టీడీపీ అధిష్ఠానం ముందడుగు వేస్తుండగా, సంస్థాగత నిర్మాణంపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లా కమిటీల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తికాగా, త్వరలోనే రాష్ట్ర కమిటీని కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.


