News November 22, 2024
గుంటూరు RRB అభ్యర్థులకు ముఖ్య గమనిక

సికింద్రాబాద్లో జరిగే RRB పరీక్షకు గుంటూరు నుంచి హాజరయ్యే అభ్యర్థులకు అన్-రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్ను నడపనున్నారు. ఈ మేరకు గుంటూరు డీఆర్ఎం రామకృష్ణ గురువారం ప్రకటన విడుదల చేశారు. గుంటూరు- సికింద్రాబాద్ RRB స్పెషల్ ట్రైన్(07171) ఈ నెల 24, 25, 26, 28, 29 తేదీల్లో ఉదయం 8 గంటలకు బయలుదేరి మంగళగిరి, విజయవాడ మార్గంలో ప్రయాణించి సాయంత్రం 4.15కి సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు.
Similar News
News December 3, 2025
అమరావతి: సచివాలయంలో బారికేడ్ల తొలగింపు

అమరావతి సచివాలయంలో ఇనుప బారికేడ్లను తొలగించారు. బారికేడ్ల వల్ల ప్రజలు, సందర్శకులు ఇబ్బంది పడుతున్నారని గమనించిన సీఎం చంద్రబాబు.. వెంటనే వాటిని తొలగించాలని పోలీసులను ఆదేశించారు. బ్లాకుల ముందు బారికేడ్లకు బదులుగా పూల కుండీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన బారికేడ్లను తొలగించి, ఆ స్థానంలో అందమైన క్రోటాన్, పూల మొక్కలను ఏర్పాటు చేశారు.
News December 3, 2025
నడింపాలెంలో రూ. 93.82 కోట్లతో CRIYN, 100 పడకల ఆసుపత్రి

ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 100 పడకల ఆసుపత్రి, సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి (CRIYN) నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. రాజ్యసభ వేదికగా ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నకు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.93.82 కోట్ల అంచనాతో ఈ నిర్మాణం ఉండబోతోందని చెప్పారు.
News December 3, 2025
రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.జి.ఆర్.ఎస్లో అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.


