News February 25, 2025
గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలు నిలిపివేత

ఓబులవారిపల్లి మండలం వై. కోట గ్రామం నుంచి రిజర్వు ఫారెస్ట్లో గల గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలను అర్ధాంతరంగా నిలిపివేసినట్లు తహశీల్దార్ శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు తొక్కిసలాటలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దారి తప్పిన ఏనుగుల గుంపు ప్రమాదం కలుగజేస్తాయని ముందు జాగ్రత్తగా ఉత్సవాలను నిలిపివేసినట్లు తెలిపారు.
Similar News
News December 3, 2025
సూర్యాపేట ఆసుపత్రిలో వింత నిబంధన.. ‘సపరేటా’?

సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో అమలు చేస్తున్న కొత్త నిబంధనపై రోగులు, వారి బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. RMO, సూపరింటెండెంట్లను కలవాలంటే ముందుగా కింద ఏర్పాటు చేసిన టేబుల్ వద్ద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఈ ప్రైవేట్ తరహా నియమాలు పెట్టడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి తీరుపై కలెక్టర్ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News December 3, 2025
₹274 కోట్లు దోచి పరారైన డోన్ రియల్టర్!

డోన్కు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని ప్రముఖుల నుంచి ₹274 కోట్లు అప్పులు, పెట్టుబడుల రూపంలో వసూలు చేసి అమెరికా పరారయ్యాడు. చిరుద్యోగి అయిన అతడు స్థిరాస్తి వ్యాపారంలోకి దిగి బెంగళూరులో ఆఫీస్ ప్రారంభించాడు. సొంత డబ్బుతో విదేశీ యాత్రలు, పార్టీలు ఇస్తూ ప్రముఖులకు దగ్గరై భారీగా డబ్బులు వసూలు చేశాడు. కొన్ని రోజులుగా అందుబాటులో లేకపోవడంతో బాధితులు బయటకు చెప్పలేక కుమిలిపోతున్నారు.
News December 3, 2025
తిరుపతి: ఫ్రెండే చంపేశాడు..!

తిరుపతి జిల్లాలో వరదయ్యపాలెం(M) లక్ష్మీపురం మిట్టకాలనీలో ఓ యువకుడు <<18446943>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. ఎస్ఐ మల్లికార్జున వివరాల మేరకు.. గ్రామానికి చెందిన హరి(33)కి తన స్నేహితుడు గౌతమ్కు మధ్య పాత గొడవలు ఉన్నాయి. మద్యం తాగుదామని హరిని గౌతమ్ పిలిచాడు. అక్కడ గొడవ చెలరేగి గౌతమ్, అతని సోదరుడు ప్రేమ్ కుమార్, చెన్నైకి చెందిన మరో ఇద్దరు హరిని రాయితో కొట్టి చంపేశారు. తర్వాత పక్కనే ఉన్న ఇంట్లో పడేసి వెళ్లిపోయారు.


