News February 25, 2025
గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలు నిలిపివేత

ఓబులవారిపల్లి మండలం వై. కోట గ్రామం నుంచి రిజర్వు ఫారెస్ట్లో గల గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలను అర్ధాంతరంగా నిలిపివేసినట్లు తహశీల్దార్ శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు తొక్కిసలాటలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దారి తప్పిన ఏనుగుల గుంపు ప్రమాదం కలుగజేస్తాయని ముందు జాగ్రత్తగా ఉత్సవాలను నిలిపివేసినట్లు తెలిపారు.
Similar News
News December 6, 2025
అవినీతి నిర్మూలనకు మాతో కలిసి నడవండి: ఎస్పీ

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వారోత్సవాల సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతిని నిర్మూలించడానికి ప్రజలు పోలీసులతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగినా, డిమాండ్ చేసినా వెంటనే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ చెప్పారు.
-SHARE IT
News December 6, 2025
చరిత్ర సృష్టించిన డికాక్

మూడో వన్డేలో భారత్పై సెంచరీ చేసిన(83 బంతుల్లో 106) డికాక్ అరుదైన రికార్డు సృష్టించారు. ఒకే టీమ్పై అత్యధిక సెంచరీలు(7) చేసిన వికెట్ కీపర్గా నిలిచారు. ఆ తర్వాత గిల్క్రిస్ట్(6)vsSL, సంగక్కర(6)vsIND ఉన్నారు. అలాగే వన్డేల్లో అత్యధిక శతకాలు(23) బాదిన వికెట్ కీపర్గా సంగక్కర సరసన చేరారు. అలాగే భారత్పై హయ్యెస్ట్ సెంచరీలు(7) చేసిన ప్లేయర్గా జయసూర్యతో సమానంగా నిలిచారు.
News December 6, 2025
మూడో విడతలో 27,277 నామినేషన్లు

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలో 4,158 సర్పంచ్ స్థానాలకు 27,277 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. 36,442 వార్డు స్థానాలకు 89,603 మంది నామినేషన్లు వేశారని పేర్కొన్నారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 1,192 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. ఉపసంహరణకు గడువు ఈ నెల 9 వరకు ఉంది. మూడో విడత ఎన్నికలు 17న జరగనున్నాయి.


