News February 4, 2025
గుండుమాల్: చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి

గుండుమాల్ మండల పరిధిలో సోమవారం రాత్రి గుండుమాల్ గ్రామానికి చెందిన గుడిసె కుర్మయ్య పొలం దగ్గర చిరుత పులి దాడి చేయడంతో లేగ దూడ మృతి చెందింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి రైతు కుర్మయ్యకు న్యాయం చేయడంతో పాటు చిరుత జాడను కనుక్కోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో మరో చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు.
Similar News
News February 14, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్కు షాక్

AUSతో జరిగిన రెండు వన్డేల సిరీస్ను శ్రీలంక 2-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇవాళ జరిగిన మ్యాచ్లో 174 పరుగుల తేడాతో కంగారూలను చిత్తు చేసింది. అంతకుముందు PAKతో జరిగిన ODI సిరీస్నూ ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో వరుసగా 4 మ్యాచ్లు ఓడినట్లయ్యింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ ఫలితాలు ఆ జట్టుకు ఎదురుదెబ్బే. కీలక ఆటగాళ్లు కమిన్స్, హేజిల్ వుడ్, మార్ష్, స్టార్క్ కూడా CTకి దూరమైన విషయం తెలిసిందే.
News February 14, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికలకు పరిశీలకుల నియామకం

MDK-NZB -KNR-ADB పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల పరిశీలకులను నియమించిందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులకు ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిశీలకులు సంజయ్ కుమార్ 9398416403, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పరిశీలకులు మహేశ్ దత్ 7993744287లను సంప్రదించాలన్నారు.
News February 14, 2025
KCRకు తెలంగాణలో జీవించే హక్కు లేదు: CM

TG: మాజీ CM KCR లాంటి వాళ్లు ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయనే కులగణనలో పాల్గొనలేదని CM రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని, వారికి తెలంగాణలో జీవించే హక్కు లేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కాకి లెక్కలు చూపి తమ సర్వే తప్పు అంటున్నారని మండిపడ్డారు. జనాభా లేకపోయినా రావులంతా కలిసి పదవులు పంచుకున్నారని దుయ్యబట్టారు. KTR, హరీశ్ గ్యాంబ్లర్లు అని విమర్శించారు.