News February 4, 2025
గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్సై మృతి

మంచిర్యాల జిల్లా జన్నారం మండల అదనపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ నాయక్ (60) గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తానాజీ నాయక్ సొంత గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం ఏంద గ్రామం. ప్రస్తుతం జన్నారం మండలం ఇంధన్ పల్లిలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. తానాజీ మృతి పట్ల లక్షెట్టిపేట సీఐ నరేందర్, జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
Similar News
News October 23, 2025
ఎక్కువ సేపు షార్ట్స్ చూడకుండా యూట్యూబ్ నియంత్రిస్తుంది!

చాలా మంది రోజంతా రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తూ ఎక్కువ సమయాన్ని వృథా చేస్తుంటారు. దీనిని నియంత్రించుకునేందుకు యూట్యూబ్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు రోజుకు ఎంత సమయం షార్ట్స్ చూడాలో సెట్టింగ్స్లో ‘డైలీ స్క్రోలింగ్ లిమిట్’ సెట్ చేసుకోవచ్చు. నిర్ణయించుకున్న సమయం పూర్తవగానే షార్ట్స్ ఫీడ్ ఆగిపోయి నోటిఫికేషన్ వస్తుంది. డిజిటల్ వెల్బీయింగ్కు తోడ్పడేలా యూట్యూబ్ ఈ ఫీచర్ను తెచ్చింది.
News October 23, 2025
ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి: కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఇటిక్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేయు సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని, ప్రజలకు నాణ్యమైన సత్వర సేవలు అందించాలన్నారు.
News October 23, 2025
మగాడివైతే మాతో పోరాడు.. ఆసిమ్ మునీర్కు పాక్ తాలిబన్ల సవాల్

పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) సవాల్ విసిరింది. తమపైకి సైనికులను పంపడం మానుకుని, ఉన్నతాధికారులే యుద్ధానికి రావాలంటూ వీడియోను రిలీజ్ చేసింది. ‘నువ్వు మగాడివైతే మాతో పోరాడు. తల్లిపాలు తాగుంటే మాతో యుద్ధం చెయ్’ అని ఆసిమ్ మునీర్కు TTP కమాండర్ కజీం ఛాలెంజ్ విసిరాడు. కాగా కజీం సమాచారం ఇచ్చిన వారికి రూ.10 కోట్ల రివార్డును పాక్ అధికారులు ప్రకటించారు.