News February 4, 2025

గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్సై మృతి

image

మంచిర్యాల జిల్లా జన్నారం మండల అదనపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ నాయక్ (60) గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తానాజీ నాయక్ సొంత గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం ఏంద గ్రామం. ప్రస్తుతం జన్నారం మండలం ఇంధన్ పల్లిలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. తానాజీ మృతి పట్ల లక్షెట్టిపేట సీఐ నరేందర్, జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Similar News

News December 9, 2025

సిద్దిపేట: పొలంలో ఎన్నికల ప్రచారం

image

సిద్దిపేట జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎలక్షన్‌లో భాగంగా అభ్యర్థులు ఎవరికీ తోచినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు. నంగునూరు మండలం సిద్దన్నపేటలో సర్పంచ్ అభ్యర్థి బెదురు తిరుపతి వ్యవసాయ క్షేత్రంలో కూలీలు వారి నాటు వేస్తున్నారని తెలుసుకుని పొలం దగ్గరకి వెళ్లి మరి నేను సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాను. ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

News December 9, 2025

గద్వాల్: నేటితో ముగియనున్న ప్రచారం

image

తొలి విడుత పంచాయతీ సమరం రెండు రోజుల్లో ముగియనుంది. జిల్లాలో ధరూర్, గద్వాల్, గట్టు, కేటిదొడ్డి మండలాల్లో మొదటి విడుత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 106 గ్రామ పంచాయతీ, 974 వార్డు మెంబర్లకు గాను 14 సర్పంచ్, 120 వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికి పోరు జరగనుంది. నేటితో ప్రచారానికి END కార్డు పడనుంది.

News December 9, 2025

మచ్చలు పడుతున్నాయా?

image

చాలామంది మహిళలు తప్పు సైజు, నాణ్యత తక్కువగా ఉన్న లోదుస్తులను వాడతారు. దీని వల్ల కొన్నిసార్లు చర్మంపై మచ్చలు పడే అవకాశం ఉంది. వీటిని పోగొట్టడానికి కొన్ని ఇంటి చిట్కాలు. * స్పూన్ పంచదారలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి మర్దనా చేయాలి. * పాలు, బాదం నూనెలను కలిపి మచ్చలున్న ప్రాంతాల్లో రాయాలి. * పెరుగులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న దగ్గర రాస్తే మార్పు కనిపిస్తుంది.