News February 13, 2025
గుండెపోటుతో మార్కెట్ కమిటీ కార్యదర్శి మృతి

బిక్కనూర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి నరసింహులు (55) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాత రాజు చెప్పారు. స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నరసింహులు అకాల మరణం పట్ల మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, అఖిలపక్ష నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Similar News
News October 18, 2025
డిప్యూటీ కలెక్టర్గా గౌకనపల్లి వాసికి పదోన్నతి

N.P. కుంట మండలం గౌకనపల్లికి చెందిన మహబూబ్ బాషాకు డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి వచ్చింది. కూడేరు మండల ఇంఛార్జ్ తహసీల్దార్గా ప్రస్తుతం మహబూబ్ బాషా విధులు నిర్వహిస్తున్నారు. నిరుపేద రైతు కుటుంబంలో పుట్టిన మహబూబ్ బాషా ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి డిప్యూటీ తహసీల్దారు, తహసీల్దారుగా చేసిన ఆయన డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందడంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
News October 18, 2025
బ్రిటన్లో ‘ఆధార్’ తరహా వ్యవస్థ?

ఆధార్ కార్డు తరహా వ్యవస్థను UKలో తీసుకురావాలని ఆ దేశ PM స్టార్మర్ భావిస్తున్నారు. తమ డిజిటల్ ఐడెంటిటీ ప్రోగ్రామ్ ‘బ్రిట్ కార్డ్’కు ఆధార్ను ప్రేరణగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్లో మాదిరి సంక్షేమం, సర్వీసుల కోసం కాకుండా ఇల్లీగల్ మైగ్రెంట్ వర్కర్ల కట్టడికి ఈ వ్యవస్థను వాడుకోనున్నట్లు సమాచారం. తన ముంబై పర్యటన సందర్భంగా ఆధార్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన వారితో స్టార్మర్ భేటీ అయ్యారు.
News October 18, 2025
ములుగు: మేము లొంగిపోతాం: ‘మావో’ లేఖ

అగ్రనాయకుల లొంగుబాట్లతో అడవులు ఖాళీ అవుతున్నాయి. మొన్న మల్లోజుల వేణుగోపాల్ టీం, నిన్న తక్కళ్లపల్లి వాసుదేవరావు@ ఆశన్న టీం లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లా ఉదంతి ఏరియా కమిటీ కార్యదర్శి సునీల్ ఓ ప్రకటన విడుదల చేశారు. తాము సైతం లొంగిపోనున్నట్లు లేఖలో వెల్లడించారు. నేటి పరిస్థితుల్లో ఆయుధాలతో యుద్ధం చేయలేమని, సీసీ కమిటీ నిర్ణయం తీసుకోవడంలో విఫలమైందన్నారు.