News March 21, 2025

గుండె పోటుతో లక్కిరెడ్డిపల్లి కానిస్టేబుల్ మృతి

image

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ముకుంద గుండె పోటుతో మృతిచెందినట్లు ఎస్సై రవీంద్ర తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ముకుందకు గుండెపోటు వచ్చిందన్నారు. వెంటనే ఎస్సై పోలీసుల సాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు

Similar News

News November 24, 2025

నెమ్లి: రెజ్లింగ్‌లో నేషనల్ లెవెల్‌కి ఎంపిక

image

నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గల నెమ్లికి చెందిన నిహారిక అనే విద్యార్థిని రెజ్లింగ్ విభాగంలో నేషనల్ లెవెల్‌కి ఎంపికైనట్టు స్కూల్ హెడ్ మాస్టర్ బాలరాజు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో స్టేట్ లెవెల్‌లో గెలుపొందిన నేపథ్యంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెడల్ తీసుకున్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ నిహారికను సన్మానించి నేషనల్ లెవెల్‌లో కూడా గెలవాలని అభినందించారు.

News November 24, 2025

పెద్దపల్లి: ‘కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి’

image

కార్మిక సామాజిక భద్రత పథకాలపై అవగాహన సదస్సుల పోస్టర్ అదనపు కలెక్టర్ దాసరి వేణు కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ-శ్రమ్ పోర్టల్ లో నిర్మాణ కార్మికులు తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు కార్మిక సంక్షేమంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుల కోసం పెద్దపల్లి 9492555258, మంథని 9492555248, గోదావరిఖని 9492555284 కార్మిక అధికారులను సంప్రదించాలని సూచించారు.

News November 24, 2025

కామరెడ్డి: చెక్కులు ఇచ్చింది వీళ్లకే..!

image

విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు KMR ఎస్పీ రాజేష్ చంద్ర భరోసా కల్పించిన విషయం తెలిసిందే. గాంధారి PSకు చెందిన కానిస్టేబుల్ వడ్ల రవికుమార్, పిట్లం PSకు చెందిన కె. బుచ్చయ్య మృతిచెందారు. SBI పోలీస్ సాలరీ ప్యాకేజ్ స్కీమ్ కింద ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఇన్సూరెన్స్ చెక్కులను SP అందజేశారు.