News March 21, 2025
గుండె పోటుతో లక్కిరెడ్డిపల్లి కానిస్టేబుల్ మృతి

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ముకుంద గుండె పోటుతో మృతిచెందినట్లు ఎస్సై రవీంద్ర తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ముకుందకు గుండెపోటు వచ్చిందన్నారు. వెంటనే ఎస్సై పోలీసుల సాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు
Similar News
News November 19, 2025
విశాఖలో నాకు తెలియని వీధి లేదు: బాలకృష్ణ

లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అప్పన్నను దర్శించుకోవడం దైవ నిర్ణయం అని బాలకృష్ణ అన్నారు. అఖండ-2 సాంగ్ రిలీజ్ నేపథ్యంలో విశాఖతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో తనకు తెలియని వీధి అంటూ లేదని, ప్రతి వీధిలో షూటింగ్ చేశానని అన్నారు. లెజెండ్ షూటింగ్ సందర్భంగా ఆర్కేబీచ్లో అద్దాన్ని పగలగొట్టుకుంటూ గుర్రంపై వెళ్లానని గర్తు చేసుకున్నారు.
News November 19, 2025
రైతులకు గుడ్న్యూస్.. నేడే ఖాతాల్లోకి డబ్బులు

AP: ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకంలో భాగంగా ఇవాళ రెండో విడత సాయం రైతుల ఖాతాల్లో జమ కానుంది. 46,85,838 మంది ఖాతాల్లో రూ.7,000 చొప్పున మొత్తం రూ.3,135 కోట్లను సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు. కడప(D) పెండ్లిమర్రిలో మ.2గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ రూ.2,000 చొప్పున పీఎం కిసాన్ సాయాన్ని నేడు రిలీజ్ చేస్తారు.
News November 19, 2025
2030 నాటికి కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు

మన దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC) ద్వారా వచ్చే ఐదేళ్లలో కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ‘GCCల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వీటిలో పని చేసే ఉద్యోగుల సంఖ్య 2026 నాటికి 24 లక్షలకు, 2030 నాటికి 34.6 లక్షలకు చేరుకుంటుంది’ అని NLB సర్వీసెస్ రిపోర్టు వెల్లడించింది. దేశంలో 1800కు పైగా GCCల్లో ఏఐ నిపుణులకు ప్రాధాన్యం లభిస్తోందని తెలిపింది. అత్యధికంగా హైదరాబాద్లో ఈ ఏడాది 41 GCCలు ఏర్పాటయ్యాయి.


